Rama jogayya sastry: ప్రతి పాట ఓ సవాలే
‘‘ఇక్కడందరూ సమర్థులే. మాలో సమర్థతని వెలికితీసే కాన్వాస్ దొరికినప్పుడే ‘ఇదిగో ఇది చేశాం’ అని మేం చెప్పుకోవడానికి... ప్రపంచం గుర్తించడానికీ వీలవుతుంది.
‘‘ఇక్కడందరూ సమర్థులే. మాలో సమర్థతని వెలికితీసే కాన్వాస్ దొరికినప్పుడే ‘ఇదిగో ఇది చేశాం’ అని మేం చెప్పుకోవడానికి... ప్రపంచం గుర్తించడానికీ వీలవుతుంది. ఇప్పుడున్న కమర్షియల్ లెక్కల్లో అలాంటి సందర్భాలు మాకు తక్కువగానే వస్తున్నాయి’’ అన్నారు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి (rama jogayya sastry). 1200కిపైగా పాటలు రాసిన ఆయన... ఈ సంక్రాంతికొస్తున్న ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy), ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya), ‘వారసుడు’ (Vaarasudu) చిత్రాలకి పాటలు రాశారు. ‘వీరసింహారెడ్డి’, ‘వారసుడు’ పాటలన్నీ ఆయనే రాయగా, ‘వాల్తేరు వీరయ్య’లో ఓ పాట రాశారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు రామజోగయ్య శాస్త్రి.
‘‘సంక్రాంతి సినిమాలకి పాటలు రాయడం అలా కుదిరిందంతే. మనం అనుకుంటే జరగదు. సినిమాలో పాటలన్నీ నేనే రాసినా, లేదంటే ఒక్క పాటే రాసినా దర్శకుడి కల... అతని విజన్కి తగ్గట్టు అడుగులు వేయడమే ముఖ్యం. అతని పరిధికి తగ్గట్టుగా నేనెంత గొప్పగా రాస్తాననేది నాకు సంబంధించిన విషయం. కాకపోతే పాటలన్నీ ఒక్కరే రాయడంలో ఓ సౌలభ్యం ఉంటుంది. పూర్తిగా కథ చెబుతారు. ఎక్కడెక్కడ ఎలాంటి సందర్భాలున్నాయి? ఏ మాట వాడాం అనేది ఓ స్పష్టత ఉంటుంది. దానికి తగ్గట్టుగా సమన్వయంతో ఆరు పాటలు పక్కాగా రాసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకొక్కరూ ఒక్కో పాట రాస్తే ఆ సమన్వయాన్ని దర్శకుడు చూసుకోవల్సి ఉంటుంది’’.
* ‘‘మూడు చిత్రాల్లో రాసిన పాటలు ఏ పాటకి ఆ పాటే అన్నట్టుగా ఉంటుంది. ‘అఖండ’ సినిమాకి రాసే అవకాశం నాకు దక్కలేదు. గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాలోనూ ఓ పాట మిస్ అయ్యింది. లోపలున్న ఆ పట్టుదలతోనే ఈసారి ‘వీరసింహారెడ్డి’ పాటలపై చూపించా. ఇప్పటికే విడుదలైన మూడు పాటలూ ఆదరణ పొందాయి. ‘వాల్తేరు వీరయ్య’ కోసం నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ’ అని పాట రాశా. ఈ లిరిక్స్లో సౌండింగ్ సరదాగా అనిపించింది. దేవిశ్రీప్రసాద్తో చెప్పగానే, దాని చుట్టూ ఓ కాన్సెప్ట్ అనుకుని ట్యూన్ ఇచ్చారు. అద్భుతంగా వచ్చింది. రచయితగా ప్రతి పాట ఓ సవాలే. చిరంజీవి పాట విని చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనోభావాలు.. పాట చిత్రీకరణ సమయంలో నేను సెట్లోనే ఉన్నా. ఆ పాట విని బాలకృష్ణ కూడా అభినందించారు’’.
* ‘‘పెద్దలు వేటూరి, సిరివెన్నెలని ముందు పెట్టుకుని చూస్తే నాలుగు అడుగులు వేయాలనుకున్న మేం ఆరడుగులు వేస్తాం. వాళ్ల తర్వాత ఎవరు అనే లెక్కల జోలికే వెళ్లకూడదు. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. సరైన కాన్వాస్, సరైన సందర్భం వచ్చినప్పుడే మా ప్రతిభ బయటికొస్తుంది. అలా అని అది కావాలి, ఇది కావాలని చెప్పడం కాదు. అలాంటి గొప్ప పనులు ఎన్ని చేస్తున్నాం అనేదే నా ప్రశ్న’’.
* ‘‘యువతరం చాలా మంది రచనవైపు వస్తున్నారు. ఇంట్లో కూర్చుని గడ్డివాము, మామిడితోట మీద ఓ పాట రాసి నేనూ రాస్తాననుకోవడం కాదు. దర్శకుడికి ఓ విజన్ ఉంటుంది. అతను బయటికి చెప్పలేడు. చెప్పగలిగితే అతనే రాసుకుంటాడు. అతని మనసులో ఉన్నది గ్రహించి, వాళ్ల విజన్ని బేరీజు వేసుకుని మన ఊహకు అందిన మేరకు రాస్తే అది అవునో కాదో చెబుతాడు. కాదంటే దానికి మరో ప్రత్యామ్నాయం మన దగ్గర ఉండాలి. మనకు మనమే ప్రశ్న వేసుకుని, ఒకటికి నాలుగు పదాలు పుట్టించే ఓర్పు, పట్టుదల ఉండాలి. ఆలోచన, భావన ఎంత గొప్పగా ఉన్నా, వ్యక్తీకరణ సులభంగా ఉండాలి. అదే టెక్నిక్. మనకు ఆ లక్షణం ఉందా? లేదా అనేది చూసుకోవాలి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)