Ramcharan: రామ్‌చరణ్‌కు బియ్యం ఇవ్వడం కోసం 264కిలోమీటర్లు నడిచిన యువకుడు..

సినీ తారలను అభిమానించే వాళ్లు చాలా మంది ఉంటారు. ఒకొక్కరు ఒక్కోలా వారిఅభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. అభిమాన తారల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకునేవారు కొందరైతే.. పాదయాత్ర చేస్తూ వెళ్లి వారిని కలిసే వారు మరికొందరు.

Published : 28 May 2022 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ తారలను అభిమానించే వాళ్లు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కోలా వారి అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. అభిమాన తారల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకునేవారు కొందరైతే.. పాదయాత్ర చేస్తూ వెళ్లి వారిని కలిసే వారు మరికొందరు. తాజాగా రామ్‌చరణ్‌ కోసం ఓ వ్యక్తి 264కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. గద్వాల్‌కు చెందిన జైరాజ్‌ అనే యువకుడు తన అరెకరం వరి పొలంలో రామ్‌ చరణ్‌ ముఖచిత్రం ఆకారంలో వరి పంటను సాగు చేసి అందులో పండిన బియ్యాన్ని చరణ్‌కు కానుకగా ఇచ్చాడు. తన కానుకను అందించడం కోసం ఏకంగా 264 కిలోమీటర్లు నడుచుకుంటూ రామ్‌చరణ్‌ నివాసానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని