RamCharan: రామ్‌చరణ్‌ రంగంలోకి

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక.

Updated : 10 Oct 2022 09:03 IST

రామ్‌చరణ్‌ (RamCharan) కథానాయకుడిగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జె.సూర్య, నవీన్‌చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సోమవారం రాజమండ్రిలో మొదలు కానుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు చరణ్‌. వారం పాటు సాగే చిన్న షెడ్యూల్‌ ఇది. దీంట్లో భాగంగా రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించనున్నారని సమాచారం. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. దీనికి తమన్‌ స్వరాలందిస్తున్నారు. తిరు, ఆర్‌.రత్నవేలు ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని