అవన్నీ పుకార్లు మాత్రమే: రానా

తన తదుపరి సినిమా గురించి ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు రానా స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ చాట్‌ షో ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన తన తదుపరి సినిమాల గురించి కొన్ని విశేషాలు....

Published : 13 Mar 2021 15:05 IST

హైదరాబాద్‌: తన తదుపరి సినిమా గురించి ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు రానా స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ చాట్‌ షో ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన తన తదుపరి సినిమాల గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా ‘దృశ్యం-2’లో రానా నటించనున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందించమని విలేకర్లు కోరగా.. అవన్నీ పుకార్లు మాత్రమేనని, ఆ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టతనిచ్చారు. మరోవైపు రానా ప్రస్తుతం ‘అరణ్య’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఏనుగుల సంరక్షణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా ఆదివాసి పాత్రలో దర్శనమివ్వనున్నారు. అలాగే, పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘అయ్యప్పనుమ్ కోషియం’కు రీమేక్‌గా ఇది రానుంది.

మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన మలయాళీ సూపర్‌హిట్‌ చిత్రం ‘దృశ్యం-2’. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ మెండుగా పొందింది. కాగా, త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. వెంకటేశ్‌, మీనా ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలకపాత్ర పోషించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రానా తాజాగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని