రణ్‌బీర్‌కపూర్‌కు కరోనా పాజిటివ్‌ 

బాలీవుడ్‌ యువకథానాయకుడు రణ్‌బీర్‌కపూర్‌ కరోనా బారినపడ్డారు. రణ్‌బీర్‌కు కరోనా సోకినట్లు ఆయన తల్లి నీతూకపూర్‌ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లో భాగంగా తన ఇంట్లోనే ఉంటున్నట్లు ఆమె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Updated : 09 Mar 2021 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ యువ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ కరోనా బారినపడ్డారు. రణ్‌బీర్‌కు కరోనా సోకినట్లు ఆయన తల్లి నీతూకపూర్‌ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లో భాగంగా తన ఇంట్లోనే ఉంటున్నట్లు ఆమె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులతో రణ్‌బీర్‌ త్వరగా కోలుకుంటాడని ఆమె ఆకాంక్షించారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ దగ్గర్నుంచి ఎంతో మంది తారలు కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా.. రణ్‌బీర్‌ త్వరగా కోలుకోవాలని కరిష్మాకపూర్‌, బిసాస బసు, అనుపమ్‌ఖేర్‌తో పాటు పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థనలు చేశారు. మరోవైపు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నటి ఆలియా భట్‌ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు.

రణ్‌బీర్‌ ప్రస్తుతం.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో ఆలియాభట్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున, మౌనిరాయ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో పాటు రణ్‌బీర్‌ ‘షంషీర్‌’ సినిమాలో నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని