రంగ్‌దే రిలీజ్‌ ఫిక్స్‌.. సుహాస్‌ ‘పద్మభూషణ్‌’

నూతన సంవత్సరం సందర్భంగా రెండు చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లు ప్రేక్షకుల ముందుకు

Published : 01 Jan 2021 19:16 IST

హైదరాబాద్‌: నూతన సంవత్సరం సందర్భంగా రెండు చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నితిన్‌ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. కీర్తి సురేశ్‌ కథానాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రంగ్‌దే’ను మార్చి 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


‘రైటర్‌ పద్మభూషణ్‌’గా సుహాస్‌

హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోవైపు కథాబలమున్న చిత్రాల్లో నటిస్తున్నాడు సుహాస్‌. ఆయన కీలక పాత్రలో షణ్ముక ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. కొత్త సంవత్సరం సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు, టైటిల్‌ను ప్రకటించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను ఛాయ్‌బిస్కెట్‌ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని