Ranga Ranga Vaibhavanga: నమ్మకంగా చెబుతున్నా.. ఆ సీన్స్ అదిరిపోతాయ్: గిరీశాయ
ఇగో లేకపోతే ఏ బంధమైనా ‘రంగ రంగ వైభవంగా’లా ఉంటుందని దర్శకుడు గిరీశాయ అన్నారు. తాను దర్శకత్వం వహించిన...
హైదరాబాద్: ఇగో లేకపోతే ఏ బంధమైనా ‘రంగ రంగ వైభవంగా’లా ఉంటుందని దర్శకుడు గిరీశాయ అన్నారు. తాను దర్శకత్వం వహించిన ‘రంగ రంగ వైభవంగా’లో సుమారు 20 సీన్లు అదిరిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ముచ్చటించేందుకు గిరీశాయ, నటీనటులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
స్క్రీన్పై యాక్టింగ్తో అదరగొట్టేస్తారు? అలాంటిది ఇంటర్వ్యూల్లో కెమెరా ముందుకు రాగానే ఎందుకు సైలెంట్గా ఉంటారు?
వైష్ణవ్ తేజ్: ఇంటర్వ్యూల్లో మీరు నన్ను చూస్తారు. అదే సినిమాలో అయితే నేను పోషించిన పాత్రను చూస్తారు.
మెగా హీరోతో సినిమా చేయాలనే ఉద్దేశంతో వైష్ణవ్ని ఎంపిక చేసుకున్నారా? లేదా మీ కథకు సరిపోతాడని ఎంచుకున్నారా?
గిరీశాయ: నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. తెలుగులో నా తొలి చిత్రం మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్తో జరగడం నిజంగానే అదృష్టం. దేవుడిచ్చిన వరం. ‘ఆదిత్య వర్మ’ చేస్తున్నప్పుడు ఓసారి వైష్ణవ్ని చూశా. ఆయన నా కథకు సరిపోతారనిపించింది. ఓ ఫ్రెండ్ సాయంతో వైష్ణవ్ని కలిసి 2020 ఫిబ్రవరిలోనే కథ చెప్పా. కరోనా కారణంగా సినిమా ప్రారంభం కావడం ఆలస్యమైంది.
ఆయన మీ కుటుంబానికి అభిమాని అని కథ చెప్పిన తర్వాతే తెలిసిందా?
వైష్ణవ్ తేజ్: కథ ప్రారంభించడానికి ముందే తాను చిరంజీవి, పవన్కల్యాణ్కు పెద్ద అభిమానినని చెప్పారు. షూటింగ్లోనూ ఎన్నో విషయాలు పంచుకున్నారు.
గిరీశాయ: పశ్చిమగోదావరి జిల్లాలో మాది ఓ గ్రామం. చిన్నప్పుడు మా ఊర్లో వీధి సినిమాలు వేసేవారు. చిరంజీవి సినిమాలు ప్రదర్శించినప్పుడు మా బ్యాచ్ మొత్తానికి ఓ రూల్ ఉంటుంది. ఊర్లో ఉన్న పువ్వులన్నీ కోసుకువచ్చి సినిమా ప్లే అవుతున్నప్పుడు విసురుతుండాలి. ‘దొంగ మొగుడు’ సినిమా వేసినప్పుడు.. మరోసారి ప్రదర్శించమని చెప్పి పువ్వులు విసిరాం.
ఇది మీ మూడో సినిమా. ఇప్పటివరకూ చేసిన ముగ్గురు హీరోల్లో మీరు గమనించిన విషయాలేమిటి?
కేతికాశర్మ: మొదటి హీరో ఆకాశ్ పూరీ నాకంటే వయసులో చిన్నవాడు. అతనితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. రెండో సినిమా నాగశౌర్యతో చేశా. ఆయన నాకంటే పెద్దవాడు. మంచి వ్యక్తి. ఇదినా మూడో సినిమా. వైష్ణవ్ నాతోటి వాడు. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలా ఉంటాం.
సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి?
గిరీశాయ: కథ రాసిన తర్వాత ఓ సారి నందు అనే ఫ్రెండ్ని కలిశా. దీని గురించి చర్చించా. కథ విన్నాక అతను.. ‘ఈ సినిమాకి రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ ఉంటే బాగుంటుందన్నాడు. సినిమా మొదలయ్యాక టైటిల్ విషయంలో ఎంతో ఆలోచించాం. చివరికి నా ఫ్రెండ్ చెప్పిన టైటిల్నే ఫిక్స్ చేశా. టైటిల్ క్రెడిట్ మొత్తం అతనిదే.
ఈ కథ చేయడానికి కారణమేమిటి?
వైష్ణవ్ తేజ్: ఏ కథనైనా నేను ప్రేక్షకుడిగానే వింటా. ఈ కథ వింటున్నప్పుడు ఓ ప్రేక్షకుడిగా ఆనందించా. కథ బాగా నచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైందనిపించింది.
రాధ పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందనుకోవచ్చా?
కేతికాశర్మ: నేను అలా అనుకోవడం లేదు. కాకపోతే, సినిమాలో ఇష్టమైన వాళ్లు ఏం అడిగినా రాధ ఇచ్చేస్తుంటుంది. నిజ జీవితంలో నేనూ అంతే.
‘‘ఫస్టాఫ్లో 10 సీన్స్, సెకండాఫ్లో 10 సీన్స్కు విజిల్స్ పడతాయి. కాన్ఫిడెంట్గా చెబుతా. ఒక ఫైట్ ఉంటుంది. అందులో వైష్ణవ్ చెప్పే డైలాగ్లకు అందరూ ఆపకుండా విజిల్స్ వేస్తారు’’ - గిరీశాయ
షూట్ ప్రారంభించినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? వీళ్లిద్దరూ ఎలా చేస్తారా? అని కంగారు పడ్డారా?
గిరీశాయ: మా సినిమా ప్రారంభమయ్యే సమయానికి ‘ఉప్పెన’ రిలీజ్ అయిపోయింది. ఆ సినిమాలో వైష్ణవ్ పాత్రకు ఈ సినిమాలో ఆయన రోల్కు చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ డే ఆయనపై ఓ ఫన్నీ సీన్ చేశాం. అది షూట్ చేసినప్పుడే తెలిసింది ఆయన బ్లడ్లో ఓ స్వింగ్ ఉంది యాక్షన్ చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కేతిక కూడా డైలాగ్స్ బాగా నేర్చుకుంటుంది. హావభావాలు కూడా అడిగి తెలుసుకుంటుంది.
షూట్ ఎన్నిరోజులు చేశారు?
గిరీశాయ: 70 రోజులు. హైదరాబాద్, వైజాగ్, అరకులో చేశాం.
కేతికని ఈ సినిమా కోసం ఎంచుకోవడానికి కారణమేమిటి?
గిరీశాయ: చాలా మంది హీరోయిన్స్ని అనుకున్నా కానీ కేతికను చూశాక. ఆమె నా సినిమాలో రాధ పాత్రకు సరిగ్గా సరిపోతుందనిపించింది. ఆమె కళ్లు చాలా బాగుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా