ప్రభావతిగా పరిచయం.. ఏంజెల్ ఆర్నగా వినోదం
అందం, అభినయం కలగలిసిన నటి రాశీ ఖన్నా. కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత సన్నజాజిలా మారి, గ్లామర్ డోస్ పెంచింది.
ఇంటర్నెట్ డెస్క్: అందం, అభినయం కలగలిసిన నటి రాశీ ఖన్నా. కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత సన్నజాజిలా మారి, గ్లామర్ డోస్ పెంచింది. ‘మద్రాస్ కేఫ్’అనే హిందీ చిత్రంతో నటిగా మారిన రాశీ 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రధాన నాయికగా ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ విడుదలై నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్పై ఓ లుక్కేద్దాం..
2014..
అక్కినేని కుటుంబం నటించిన ‘మనం’ చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది రాశీ. అయితే ఇందులో ప్రేమ అనే చిన్న పాత్రకే పరితమైంది. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కథానాయకులుగా తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నాయికగా కెరీర్ ప్రారంభించింది. శ్రీ సాయి శిరీషా ప్రభావతి.. ఇంత పెద్ద పేరేంటో అంటూ ఆమె పలికిన హావభావాలు ఎప్పటికీ మరిచిపోలేం. అదే ఏడాది సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘జోరు’ చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఓ పాటనీ ఆలపించి, గాయనిగా మంచి మార్కులే కొట్టేసింది.
2015..
2015లో ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అవే.. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’, రామ్ ‘శివమ్’, రవితేజ ‘బెంగాల్ టైగర్’. వీటిల్లో ‘జిల్’లో పోషించిన సావిత్రి పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
2016..
2016లో సాయి తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సుప్రీం’ చిత్రంలో బెల్లం శ్రీదేవిగా కనిపించి విశేషంగా ఆకట్టుకుంది. ‘హైపర్’ సినిమాలో భానుమతిగా రామ్ సరసన మరోసారి కనువిందు చేసింది.
2017..
ఎన్టీఆర్ సరసన ‘జై లవకుశ’లో ప్రియ, గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’లో శ్రుతి పాత్రల్లో కనిపించింది.
2018..
‘బెంగాల్ టైగర్’ తర్వాత ‘టచ్ చేసి చూడు’ సినిమా కోసం మరోసారి రవితేజతో జోడీ కట్టింది రాశీ. ఇందులో పుష్పగా నటించింది. వరుణ్ తేజ్తో కలిసి నటించిన ప్రేమకథా చిత్రం ‘తొలిప్రేమ’. ఈ చిత్రంలో వర్ష అనే పాత్రలో దర్శనమచ్చి యువతని తనవైపు తిప్పుకుంది. నితిన్ సరసన ‘శ్రీనివాస కల్యాణం’లో శ్రీ అనే పాత్రలో ఒదిగిపోయి కుటుంబ కథా ప్రేక్షకుల్ని అలరించింది.
2019..
వెంకటేశ్, నాగ చైతన్యల మల్టీస్టారర్ ‘వెంకీమామ’లో చైతూకి జోడీగా సందడి చేసిన రాశీ, అదే ఏడాది సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో ఏంజెల్ ఆర్నగా కనిపించింది. టిక్టాక్ వీడియోలు చేసే అమ్మాయిగా ఎంత వినోదం పంచిందో ప్రత్యేక చెప్పనవసరం లేదు.
2020..
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లవ్స్టోరీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో యామిని అనే పాత్రలో ఒదిగిపోయింది.
2021..
ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘థ్యాంక్ యు’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకి విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. దీంతోపాటు గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’తో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?