Rashi Khanna: మొహమాటం లేకుండా చెప్పాల్సిందే
కథానాయిక రాశిఖన్నా జోరు కొనసాగుతోంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. గోపీ చంద్తో కలిసి ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో లాయర్ ఝాన్సీగా ఆమె సందడి చేస్తున్నారు.
కథానాయిక రాశిఖన్నా (Rashi Khanna) జోరు కొనసాగుతోంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. గోపీ చంద్తో (Gopichand) కలిసి ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial) ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో లాయర్ ఝాన్సీగా ఆమె సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా రాశిఖన్నా శనివారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.
‘‘విడుదల రోజు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటాన్ని ఇష్టపడతాను. అలా ప్రేక్షకుల స్పందనని స్వయంగా చూడొచ్చు. ‘పక్కా కమర్షియల్’నీ తొలి రోజు తొలి ఆటని ప్రేక్షకులతో కలిసి చూశా. అంత మంది ఒకేసారి నవ్వుకుంటుంటే చూడటం మంచి అనుభవాన్నిచ్చింది. లాయర్ ఝాన్సీ పాత్రని దర్శకుడు చెప్పినప్పుడే నాకు నచ్చింది. ‘ప్రతీ రోజూ పండగే’లో ఏంజెల్ ఆర్ణ పాత్ర చూశాక చాలా మంది ‘ఇలాంటి పూర్తిస్థాయి కామెడీ పాత్రలు చేస్తే బాగుంటుంది’ అన్నారు. ‘పక్కా కమర్షియల్’ కోసం దర్శకుడు మారుతి అలాంటి పాత్రనే సిద్ధం చేశారు’’.
‘‘లాయర్ ఝాన్సీ తన పాత్ర కోసం లా చదివేసినట్టుగా, నేనేమీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాలేదు. దర్శకుడు మారుతిపై భరోసాతో సెట్కి వెళ్లా. ఆ మేనరిజమ్ దగ్గర్నుంచి, సంభాషణల వరకు అన్ని విషయాల్లోనూ ఆయన, మా చిత్రబృందం సాయం చేసింది. అయితే ఝాన్సీలాగా నేను ప్రతి సినిమా కోసం ముందస్తుగా ఎంతో కొంత సన్నద్ధం అవుతుంటా’’.
‘‘సినిమాలో సంభాషణలు అభ్యంతరకంగా ఉన్నాయనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేయాల్సిందే. సెట్లో నేను అలా చాలాసార్లు చెప్పా. కొద్దిమంది దర్శకులు వింటారు, కొందరు వినరు. అయినా నా అభ్యంతరాల్ని నేను వ్యక్తం చేస్తూనే ఉంటా. చాలామంది కథానాయికలు కమర్షియల్ హీరోయిన్ అనే ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఆ గుర్తింపుని నేను తొలి అడుగుల్లోనే సొంతం చేసుకున్నా. ఇప్పుడు నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతున్నా. రెండు రకాల పాత్రలు చేస్తూ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం. కథానాయికగా ఎనిమిదేళ్ల ప్రయాణం నాది. జీవితాల్లో ఎత్తుపల్లాలు సహజం. నా జీవితంలోనూ ఉన్నాయి. నా కెరీర్పరంగా సంతోషంగా ఉన్నా’’.
‘‘పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం... ఖాళీ దొరికితే నేను చేసే పనులు ఇవే. కాకపోతే ఈమధ్య సమయమే దొరకడం లేదు. నాకు చరిత్ర అంటే మక్కువ. అది తెలుసుకునే కథా నాయకుడు కార్తి మొఘలుల చరిత్రకి సంబంధించి ఓ పుస్తకం కానుకగా ఇచ్చారు. అది చదవాలి’’.
‘‘నా మాటలపై ఆమధ్య సామాజిక మాధ్యమాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటిపైన నేను ఇదివరకే ఓ స్పష్టతని ఇచ్చా. మనమంతా మనుషులమే కదా. మాటల్ని అర్థం చేసుకునే విధానంలో ఒకొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. అందుకే నా అభిప్రాయం ఇదీ అంటూ వివరణ ఇచ్చేసరికి అర్థం చేసుకున్నారు. వస్తున్న అవకాశాలు, పాత్రల్ని బట్టి ప్రయాణం సాగుతుంటుంది. హిందీలో వెబ్ సిరీస్ చేశా. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ‘యోధ’ సినిమా చేశా. కార్తీతో చేస్తున్న ‘సర్దార్’ దాదాపుగా పూర్తయింది. తెలుగులో కొత్తగా మూడు సినిమాలకి సంతకం చేశా. అవి అధికారికంగా బయటికొస్తాయి. నటిగా చేయడానికి ఇంకా చాలా ఉంది. అసలు సిసలు ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టుగా ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!