నాగచైతన్య సరసన నాయికగా రాశీఖన్నా?

‘మనం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నాయిక రాశిఖన్నా. ఆ తర్వాత ‘బెంగాల్‌ టైగర్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించింది. తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ‘థ్యాంక్‌ యూ’ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారనే వార్తలొస్తున్నాయి.

Published : 04 Apr 2021 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నాయిక రాశీఖన్నా. ఆ తర్వాత ‘బెంగాల్‌ టైగర్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించింది. తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తోన్న ‘థ్యాంక్‌ యూ’ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారనే వార్తలొస్తున్నాయి. త్వరలోనే రాశీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. 

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుపుకొంటోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్‌చైతన్య ముగ్గురు నాయికలతో రొమాన్స్ చేయనున్నారట. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం తర్వాత తెలుగులో రాశీ నటించిన చిత్రాలు ఏవీ లేవు. ప్రస్తుతం ఆమె మారుతీ దర్శకత్వంలో గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’లో నటించనుంది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అయితే, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం కంటే ముందే అక్కినేని కుటుంబ కథా చిత్రం ‘మనం’లో నాగచైతన్య పక్కన అతిథి పాత్రలో కనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని