Rashi khanna: బాధ్యత మరింత పెరిగింది
అందం.. అభినయాలతో అలరించడమే కాదు.. మంచి మనసున్న నాయికగానూ అందరి మన్ననలు అందుకుంటోంది రాశీ ఖన్నా. కరోనా - లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది.
అందం.. అభినయాలతో అలరించడమే కాదు.. మంచి మనసున్న నాయికగానూ అందరి మన్ననలు అందుకుంటోంది రాశీ ఖన్నా. కరోనా - లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారమందిస్తూ.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’ ఆమెని పలకరించగా.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందిస్తున్నట్లున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని చూస్తే ఏమనిపిస్తుంది?
కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితాల్ని చిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా కూలి పనులు, చిన్న చిన్న ఉద్యోగాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారి జీవితాలు దుర్భరంగా మారాయి. క్షేత్ర స్థాయిలో వారి పరిస్థితులు చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. అందుకే నేను నా వంతుగా ఏదైనా చేయాలనిపించి చితీ’గ్తి’లీi౯్చ‘ః’ ద్వారా ఆహారమందించే ప్రయత్నం చేస్తున్నా. రోటీ బ్యాంక్తో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపి ఆకలితో ఉన్న వారి కడుపులు నింపుతున్నా. కరోనా ఉద్ధృతి భయపెడుతున్నా నేను నా బృందంతో కలిసి చాలా ప్రాంతాలు తిరిగి సహాయం అందిస్తున్నా. వృద్ధాప్య గృహాలకు వెళ్లి వారికి అవసరమైన నిత్యావసరాలు అందిస్తున్నాం. ఈ విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సర్ మాకెంతో సహకారమందిస్తున్నారు. అయితే బయట సాయం కోరుతున్న చేతులు చాలా ఉన్నాయి. అవసరం చాలా పెద్దది. ఈ సమయంలో ఒక్కరిగా ఏం చేయలేం. అందరూ చేయి చేయి కలిపితే.. ఈ కష్ట సమయాలను సులభంగా అధిగమించగలుగుతాం. ఇది ప్రతిఒక్కరూ గ్రహించాలి.
కరోనా ఉద్ధృతిలోనూ ‘థ్యాంక్ యూ’ చిత్రం కోసం ఇటలీకి వెళ్లారు. భయం అనిపించలేదా?
ఈ పరిస్థితులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. భయపడుతూ ఎన్నాళ్లని కూర్చుంటాం చెప్పండి. పరిస్థితులు ఎలా ఉన్నా.. ధైర్యంగా పోరాడాల్సిందే. ప్రస్తుతం యూరప్లో కరోనా ఉద్ధృతి అంతగా లేదు. అందుకే లోపల కాస్త భయమున్నా.. ధైర్యంగా మా షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాం. ప్రతిరోజూ సెట్లోని అందరికీ కొవిడ్ టెస్ట్లు చేసేవారు. సెట్లో కరోనా కిట్లు ధరించడం తప్పని సరి చేశారు. సాధ్యమైనంత వరకు 30మంది లోపు సిబ్బందితోనే పని చేసే వాళ్లం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా.. వాహనాల్లోనూ సామాజిక దూరం పాటిస్తూ వెళ్లే వాళ్లం. ఇలా మే 7 వరకు ఎంతో జాగ్రత్తగా చిత్రీకరణలో పాల్గొన్నాం.
‘పక్కా కమర్షియల్’ చిత్రంలో మీరు సీరియల్ నటిగా కనిపిస్తారని తెలిసింది. నిజమేనా?
అవును.. నిజమే. ప్రతిరోజూ పండగే’ సినిమాలో టిక్టాక్ స్టార్గా ఏంజెల్ ఆర్నా అనే పాత్రలో కనిపించా. ఆ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. అది అందరికీ నచ్చింది. అందుకే మారుతి నాకు అప్పుడే మాటిచ్చారు.. ‘తర్వాతి సినిమాలో పెద్ద పాత్ర ఇస్తాన’ని. అన్నట్లుగానే ‘పక్కా కమర్షియల్’లో నా పాత్రని మరింత వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఏంజెల్ ఆర్నా పాత్రకి రెండు రెట్లు ఎక్కువ వినోదాలు నిండిన పాత్రగా ఉంటుంది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమా 40శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’.
కొత్తగా చేస్తున్న సినిమాలేంటి?
తమిళంలో కార్తితో ఓ సినిమా చేస్తున్నా. ఆర్యాతో చేసిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ సేతుపతితో ‘తుగ్లక్ దర్బార్’ చేశా. అదీ విడుదల కావాల్సి ఉంది.
మలయాళంలో పృధ్విరాజ్తో ఓ సినిమా చేస్తున్నా. హిందీలో షాహిద్ కపూర్తో ఓ చిత్రం చేస్తున్నా. అలాగే బాలీవుడ్లో మరో స్టార్ హీరో సినిమాకి సంతకాలు చేశా. త్వరలో ఆ చిత్ర బృందం వాటి వివరాలు అధికారికంగా ప్రకటిస్తుంది. అలాగే తెలుగులో పలు కొత్త కథలు చర్చల దశలో ఉన్నాయి.
‘థ్యాంక్ యూ’ చిత్ర విశేషాలేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?
సినిమా కథేంటి.. నా పాత్రేంటి? అన్నది ఇప్పుడే చెప్పలేను. కచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను.. ఇదొక విభిన్నమైన రొమాంటిక్ ఫిల్మ్. ప్రేక్షకులకు మంచి ట్రీట్లా ఉంటుంది. విక్రమ్ దర్శకత్వంలో నేను చేస్తున్న తొలి చిత్రమిది. ఆయన నా పాత్రని ఎంతో అద్భుతంగా మలిచారు. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. నాకు మంచి పేరు తీసుకొస్తుంది. ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్తో పని చేయాలన్నది నా కల.అది ‘థ్యాంక్ యూ’తో నెరవేరింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా