‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సి 15’వర్కింగ్ టైటిల్గా ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించనుందని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సి 15’వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఆమె ఇందులో జర్నలిస్టుగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శంకర్ చెప్పిన కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించిందట. అయితే అధికారికంగా చిత్రబృందం ఎక్కడా ప్రకటించలేదు. సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కనుందని రామ్చరణ్ ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని ముమ్మరంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో పాటు చిరంజీవి కూడా నటిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది సినిమాని తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్తో కలిసి ‘పుష్ప’, హీరో శర్వానంద్తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నాయికగా నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి ‘గుడ్బై’ చిత్రంలో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు