Rashmika: విజయ్‌ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక (Rashmika).. ఆన్‌ స్క్రీనైనా, ఆఫ్‌ స్క్రీనైనా ఈ పెయిర్‌కి ఉన్న క్రేజ్‌ వేరే లెవల్‌. ఒకరి గురించి మరొకరు ఏం మాట్లాడినా సోషల్‌మీడియాలో....

Published : 03 Jul 2022 12:03 IST

ఆసక్తికరంగా మారిన రీల్‌ పెయిర్‌ ఇన్‌స్టా పోస్టులు

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక (Rashmika).. ఆన్‌ స్క్రీనైనా, ఆఫ్‌ స్క్రీనైనా ఈ పెయిర్‌కి ఉన్న క్రేజే వేరు. తాజాగా వీరిద్దరూ ఇన్‌స్టా వేదికగా చేసిన కామెంట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విజయ్ దేవరకొండ పేరుని ఇకపై అందరికీ చెబుతానని రష్మిక అనగా.. ‘గీత గోవిందం’(Geetha Govindam) నుంచి నువ్వే నా స్ఫూర్తి అంటూ విజయ్‌ రిప్లై ఇచ్చారు. 

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’ (Liger). కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో సిద్ధమైన యాక్షన్‌ కథా చిత్రమిది. పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకుడు. ఆగస్టు 25న ఈసినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం శనివారం ఓ సరికొత్త పోస్టర్‌ విడుదల చేసింది. పుష్పగుచ్ఛం అడ్డుపెట్టుకుని తన శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా విజయ్‌ అందులో కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన రష్మిక ‘‘ఇప్పటివరకూ నన్ను ఎవరైనా ‘నీకు స్ఫూర్తి ఎవరు?’ అని ప్రశ్నిస్తే ఎవరి పేరు చెప్పాలో అర్థమయ్యేది కాదు. కానీ, విజయ్‌.. ఇకపై నీ పేరే చెబుతా. ‘లైగర్‌’.. నీకు మా ప్రేమ, మద్దతు ఉంది. నువ్వు ఏం చేయగలవో ఈ ప్రపంచానికి చూపించు. ఆల్‌ ది బెస్ట్‌’’ అని ఆమె రాసుకొచ్చారు. రష్మిక పెట్టిన పోస్ట్‌పై విజయ్‌ స్పందిస్తూ.. ‘‘రుషీ.... ‘గీతగోవిందం’ సమయం నుంచి నువ్వే నా స్ఫూర్తి. లైగర్‌ మెరుపులను ఈ ప్రపంచం చూడనుంది. నేను మాటిస్తున్నా’’ అని పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘గీతగోవిందం’ కోసం విజయ్‌ దేవరకొండ-రష్మిక మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఫీల్‌గుడ్‌ ప్రేమ, కుటుంబకథతో సిద్ధమైన ఈ చిత్రంలో ఈ జోడీ నటనకు అందరూ మనసు పారేసుకున్నారు. అనంతరం వీరిద్దరూ ‘డియర్‌ కామ్రేడ్‌’లోనూ (Dear Comrade) కలిసి నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని