Rashmika: ‘పుష్ప’కు కష్టపడితే.. ఈ చిత్రానికి విశ్రాంతి తీసుకున్నా: రష్మిక
రష్మిక.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఎంపిక చేసుకున్న పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ భామ రష్మిక.. వరుస సినిమా అవకాశాలు, హిట్లతో దూసుకెళ్తోంది. ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. ఇటీవల, ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా సందడి చేసిన ఆమె ఇప్పుడు శర్వానంద్ సరసన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో ఆద్యగా అల్లరి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా రష్మిక మీడియాతో ముచ్చటించింది.
అక్కడ ఇంప్రెస్ అయ్యా..
దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమా స్క్రిప్టును కొవిడ్ ఫస్ట్వేవ్ లాక్డౌన్లో వినిపించారు. ఆ కథ, ఆయన చెప్పిన తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం నాకు బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ చిత్రంలో ఎలా అయినా సరే నటించాలనుకున్నా. మహిళలకు అధిక ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో ఆయా పాత్రల్లో ఎవరెవరు నటిస్తారా? అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. ఖుష్బూ, రాధికా, ఊర్వశీలాంటి సీనియర్ నటులు నటిస్తున్నారని తెలియగానే సంబరపడ్డా. వారితో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఓ నటిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.
అదీ నా పాత్ర..
నేనిందులో ఆద్య అనే పాత్ర పోషించా. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా వ్యవహరించే క్యారెక్టర్ అది. కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడుతుంది. నా పాత్రే కాదు ఈ సినిమాలోని ప్రతి పాత్రా ప్రత్యేకంగా నిలుస్తుంది. సంభాషణలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.
నేనూ వారితో కలిసిపోయా..
‘పుష్ప’ సినిమాలో నటిస్తూనే ఈ చిత్రంలోనూ నటించా. ‘పుష్ప’ కోసం అడవుల్లో నటించి, ఈ సినిమా సెట్లో అడుగుపెడితే పిక్నిక్కు వచ్చినట్టు అనిపించేది. అక్కడ కష్టపడి ఇక్కడ విశ్రాంతి తీసుకునేదాన్ని. శర్వానంద్ చాలా మంచి వ్యక్తి. తన మా కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చేవాడు. ఈ చిత్రంలో ఆడవాళ్లంతా శర్వాను ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసి ఈ డోస్ ఇంకాస్త పెంచా. మరి మేం పెట్టిన ఇబ్బంది ఏంటి? దాన్నుంచి శర్వా ఎలా బయటకు వచ్చారో సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
అది గొప్ప విషయం..
కిశోర్కు దైవభక్తి ఎక్కువ. చాలా సరదాగా ఉంటారు. ఆయనతో మాట్లాడితే మన మోముల్లో చిరునవ్వు చిందాల్సిందే. పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మహిళలకు ఆయన ఎంత విలువిస్తారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్, హీరోయిజం హంగులతో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో మహిళల కోసమే ఓ చిత్రం తెరకెక్కించడం గొప్ప విషయం.
మరోసారి నటించానుంది..
ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుంది శ్రీ లక్మి వేంకటేశ్వర సినిమాస్ సంస్థ. మరోసారి ఈ సంస్థలో పనిచేయాలనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని భావిస్తున్నా. ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కీర్తి సురేశ్, సాయి పల్లవి, సుకుమార్గారు హాజరవడం చాలా ఆనందంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి