విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక?

రష్మిక మందన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్‌బాబు సరసన క్యూట్‌గా కనిపించి  అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Published : 28 Feb 2021 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రష్మిక మందన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్‌బాబు సరసన క్యూట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రష్మిక ‘గీత గోవిందం’ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో కలిసి సందడి చేసింది. సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేయనున్నాడు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరోవైపు కథానాయికగా రష్మిక మందనను తీసుకోవాలని దర్శకుడు సుకుమార్‌ నిర్ణయించుకున్నాడని సినీ వర్గాలు  చెప్పుకుంటున్నాయి. ఈ విధంగా చూస్తే రష్మిక - విజయ్‌ దేవరకొండతో కలిసి ముచ్చటగా మూడో చిత్రం అవుతోంది. గతంలో ‘డియర్‌ కామ్రేడ్‌’లోనూ నటించింది. ప్రస్తుతం సుకుమార్‌ - అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ‘పుష్ప’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు‌. ఈ చిత్రంలోనూ రష్మికనే కథానాయిక. రష్మిక హిందీలో ‘మిషన్‌ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. సిద్దార్థ్‌ మల్హోత్రా కథానాయకుడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని