Rashmika Mandanna: అందుకే ఆ చిత్రాన్ని ఒప్పుకున్నా!

‘మిషన్‌ మజ్ను’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న రష్మిక అందుకు సంబంధించిన అనుభవాలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది

Updated : 01 Sep 2021 20:08 IST

ముంబయి: తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలతో బిజీగా ఉన్న భామ రష్మిక మందన.. ‘మిషన్‌ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. సిదార్థ్‌ మల్హోత్ర హీరోగా, 1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శంతన్‌ బాగ్చి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న రష్మిక.. ‘మిషన్‌ మజ్ను’ అనుభవాలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

‘‘ఈ సినిమా కథ చెబుతున్నప్పుడే ఇందులో నటించాలనుకున్నా. ఇందులో నేను చేసిన పాత్ర నా కెరీర్‌లో మళ్లీ రాదనిపించింది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా. షూటింగ్‌ నిమిత్తం నార్త్‌ ఇండియా మొత్తం తిరిగాను. అక్కడి సంస్కృతి, భాష, ప్రజలు, బాలీవుడ్‌ ఇండస్ట్రీ.. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగా. నిజానికి.. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అని అనిపించింది. అలాగే ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకు మించి మరేదీ అడగలేను. మిషన్‌ మజ్ను టీమ్‌.. ఐ లవ్‌ యూ’’ అంటూ బాలీవుడ్‌లో తన తొలి చిత్ర అనుభవాలను పంచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని