మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!

తన చిరునవ్వులతో కుర్రాళ్ల మనసులు కొల్లగొడుతున్న యువ కథానాయిక రష్మిక మందన. ఈ అమ్మడు దక్షిణాది నుంచి తాజాగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిందీ

Published : 02 Mar 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన చిరునవ్వులతో కుర్రాళ్ల మనసులు కొల్లగొడుతున్న యువ కథానాయిక రష్మిక మందన. ఈ అమ్మడు దక్షిణాది నుంచి తాజాగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిందీ కథానాయకుడు సిద్దార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం మార్చి 4న లఖ్‌నవూకు వెళ్లనుంది. తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక ఈ సినిమా షూటింగ్ కోసం‌ చాలా ఉత్సాహంగా ఉంది.  స్పై థ్రిల్లర్ చిత్రంగా వస్తోన్న చిత్రానికి శంతన్‌ బాగ్చి దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌, గిల్టీ బై అసోసియేషన్‌ మీడియా, ఎల్‌ఎల్‌పీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చిత్రంలో పర్మీత్‌ సేథి, షరీబ్‌ హష్మీ, అర్జన్‌ బజ్వాలు తదితరులు నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి 11, 2021 ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్నట్లు రష్మిక ఈ మధ్యే ముంబైలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది.  ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’లో నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 13, 2021న తెరపైకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని