Ravanasura: వచ్చే ఏడాది ఏడు సినిమాలు
‘‘ఇప్పటివరకూ ఏ భాషలోనూ ఇలాంటి కథ రాలేదు. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు షాక్ అవుతారు. అంత కొత్తగా ఉంటుంది.
‘‘ఇప్పటివరకూ ఏ భాషలోనూ ఇలాంటి కథ రాలేదు. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు షాక్ అవుతారు. అంత కొత్తగా ఉంటుంది. ఇది విజయవంతమైతే కథానాయకులు ఇలాంటి కథల్లో నటించడంపై మరింత ఆసక్తిని ప్రదర్శిస్తార’’న్నారు అభిషేక్ నామా. పంపిణీదారుడిగా కొనసాగుతూనే... అభిషేక్ పిక్చర్స్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల రవితేజ కథానాయకుడిగా... ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్తో కలిసి అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). సుధీర్వర్మ దర్శకత్వం వహించారు. శుక్రవారమే చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘థ్రిల్లర్ సినిమాల్ని థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిందే. కథలు ఆశ్చర్యపోయే విషయాలతో ముడిపడి ఉంటాయి. వాటిని ముందే బయటికి చెబితే కిక్ ఉండదు. అందుకే ‘రావణాసుర’ కథలోని అంశాల్ని రహస్యంగా ఉంచాం. ముందు కథానాయకుడు రవితేజ ఈ కథ విన్నారు. ఆయనే నన్ను పిలిచి ఈ సినిమా చేయమన్నారు. శ్రీకాంత్ విస్సా చెప్పిన ఈ కథ వినగానే థ్రిల్కి గురయ్యాను. దర్శకుడు, కథానాయకుడు, నేను బలంగా నమ్మి సినిమా చేశాం. ఆ నమ్మకంతోనే ప్రపంచవ్యాప్తంగా సొంతంగానే చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ విషయాల్ని ఇందులో ఎలా చూపించారన్నది కీలకం. రవితేజని కొత్తగా ఆవిష్కరించిన చిత్రం ఇది’’.
* రవితేజ ఎన్నో విజయాలు అందుకున్నారు. ఈమధ్యే విడుదలైన ‘ధమాకా’ కూడా రూ.వంద కోట్లకిపైగా వసూళ్లు సాధించింది. ఆయనకి విజయాలు కొత్త కాదు. కానీ ఒక నటుడు కొత్తగా చేసిన పాత్రని ప్రేక్షకులు గొప్పగా ఆదరించినప్పుడు లభించే ఆనందం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ‘కాంతార’లాంటి సినిమాలు చూసినప్పుడు అద్భుతం అంటాం. కానీ ఇక్కడ చేయాలంటే మాత్రం ఇది మనవాళ్లు చూస్తారా లేదా? అని ఆలోచిస్తాం. రవితేజ మాత్రం ఆ సందేహాల్ని పక్కనపెట్టి కొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడుతుంటారు. ఈ సినిమా విషయంలో అదే చేశారు. ఈ చిత్రం విజయవంతమైతే కొనసాగింపుగా మరో చిత్రం చేస్తాం. సుధీర్వర్మ సాంకేతికంగా బలమైన దర్శకుడు. గొప్పగా, అనుకున్న వ్యయంలోనే సినిమాని పూర్తి చేశాడు. నేను, తను ఇదివరకు కలిసి చేసిన ‘కేశవ’ విజయం సాధించింది. ‘రావణాసుర’తో మాత్రం బ్లాక్బస్టర్ కొడతాం’’.
* ‘‘ఆలస్యమైనా మంచి కాన్సెప్ట్లతోనే ప్రయాణం చేయాలనుకుంటా. మంచి కథల్ని ఎంచుకోవడం కోసమే సమయం తీసుకుంటుంటా. మరోవైపు నేను పంపిణీ రంగంలోనూ కొనసాగుతున్నా. కరోనా తర్వాత ప్రేక్షకులు వస్తారో రారో అనే సందేహాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా మారాయి. మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. అందుకే పంపిణీ, నిర్మాణం పరంగా వేగం పెంచాం. వచ్చే ఏడాది మా సంస్థ నుంచి ఏడు సినిమాలు సెట్స్పైకి వెళతాయి. ప్రస్తుతం కల్యాణ్రామ్ కథానాయకుడిగా ‘డెవిల్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అది చివరి దశలో ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్ నేపథ్యంతో జేసన్ సంజయ్ చిత్రం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
-
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం