Ravi Teja: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ వైరల్‌వీడియో చూశారా..!

రవితేజ తొలి పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నటిస్తున్నారు.

Published : 22 Sep 2022 15:54 IST

హైదరాబాద్‌: రవితేజ తొలి పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నటిస్తున్నారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా రానున్న ఈ బయోపిక్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన సంచలనం నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌లో నటి రేణుదేశాయ్‌, అనుపమ్‌ఖేర్‌ జాయిన్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దర్శకుడు వంశీ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో రవితేజ మాట్లాడే విధానం, నడక, బాడీలాంగ్వేజ్‌, గెటప్‌ అన్ని గతంలో కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి.  రవితేజ ఎనర్జీ గురించి అందరికీ తెలుసు కానీ టైగర్‌ నాగేశ్వరరావు సినిమా చూస్తున్నప్పుడు  రవితేజ కనిపించడు కేవలం నాగేశ్వరరావు మాత్రమే కనిపిస్తాడు’’ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని