‘ఖిలాడి’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కుతోంది. ‘ప్లే స్మార్ట్‌’ అనేది ఉపశీర్షిక. రవితేజతో కలిసి గతంలో ‘వీర’ను తెరకెక్కించిన రమేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల

Published : 30 Jan 2021 17:25 IST

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కుతోంది. ‘ప్లే స్మార్ట్‌’ అనేది ఉపశీర్షిక. రవితేజతో కలిసి గతంలో ‘వీర’ను తెరకెక్కించిన రమేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఇదే విషయాన్ని దర్శకుడు రమేశ్‌వర్మ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ బంపర్‌హిట్‌ కొట్టి మంచి జోరు మీద ఉన్నారు. ఖిలాడిలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవీశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తుండగా పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన రవితేజ ఎంట్రీ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది!

ఇవీ చదవండి!

‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌!

#NTR30: హీరోయిన్‌ ఈమేనా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని