అసలు ఎవరీ రియా చక్రవర్తి?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆకస్మాత్తుగా మరణించడంపై అతడి కుటుంబసభ్యులు.. పలువురు ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అనేక
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా మరణించడంపై అతడి కుటుంబసభ్యులు.. పలువురు ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసుపై దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రియా చక్రవర్తి. బాలీవుడ్లో కథానాయికగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న రియా.. ఇప్పుడు సుశాంత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. సినిమాల కోసం నిర్మాణ సంస్థల వద్దకు వెళ్లాల్సిన ఆమె.. పోలీస్స్టేషన్, దర్యాప్తు సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో కేంద్ర బిందువుగా మారిన రియా చక్రవర్తి అసలు ఎవరు? సుశాంత్తో సంబంధమేంటి? ఆమెపైనే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి?
రియా చక్రవర్తి 1992 జులై 1న బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి స్వస్థలం పశ్చిమ బెంగాల్ కాగా.. తల్లిది కర్ణాటకలోని మంగళూరు. తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడంతో హరియాణాలోని అంబాల ఆర్మీ పాఠశాలలో రియా విద్యాభ్యాసం జరిగింది.
సినీరంగంలో తెరంగేట్రం
2009లో రియా ఓ టీవీ ఛానెల్లో వీడియో జాకీ(వీజే)గా చేరింది. 2012లో తెలుగులో వచ్చిన ‘తూనీగ..తూనీగ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో మరుసటి ఏడాది ‘మేరే డాడీకి మారుతీ’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సోనాలీ కేబుల్’, ‘దోబారా: సీ యువర్ ఎవిల్’, ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’, ‘బ్యాంక్ చోర్’, ‘జలేబీ’ చిత్రాల్లో నటించి యువ కథానాయికగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల రియా తన సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి వివిడ్రేజ్ రియాలిటిక్స్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్థాపించింది.
సుశాంత్సింగ్తో పరిచయం
రియా నటించిన ‘మేరీ డాడీకి మారుతీ’ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. 2013లో ఈ చిత్రం విడుదలైంది. ఇదే ఏడాది ఓ జిమ్లో రియా.. సుశాంత్సింగ్ తొలిసారి కలిశారట. ఆ తర్వాత తరచూ మాట్లాడుకునేవారట. అయితే 2019 ఏప్రిల్లో వీరిద్దరు సన్నిహిత స్నేహితులుగా మారారు. పలుమార్లు ఇద్దరు కలిసి కనిపించారు.. విహారయాత్రలకు వెళ్లారు. దీంతో వీరి మధ్య ప్రేమబంధం ఉందని అందరూ భావించారు. కానీ, వారిద్దరు ఎప్పుడూ ఆ విషయం బయటపెట్టలేదు. అయితే సుశాంత్తో కలిసి యూరప్ ట్రిప్కి వెళ్లామని ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా వెల్లడించింది. పారిస్, స్విట్జర్లాండ్, ఇటలీకి వెళ్లామని.. అయితే అక్కడ సుశాంత్ ఒకసారి హుషారుగా.. మరోసారి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. ఇటలీలో బస చేసిన హోటల్ గది నుంచి బయటకు రాలేదని తెలిపింది. ఏడాదిపాటు సుశాంత్తో కలిసి ఉన్న రియా.. అతడు మృతి చెందడానికి ఆరు రోజుల ముందు అంటే జూన్ 8న అతడి ఇంటిని వదిలి వెళ్లిపోయింది.
సుశాంత్సింగ్ మృతి
సుశాంత్సింగ్ జూన్ 14న ముంబయిలో బాంద్రాలోని తన ఇంట్లో మృతి చెందాడు. పోలీసులు అతడిది ఆత్మహత్య అని తేల్చిచెప్పారు. అయితే అతడి కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు బిహార్లో ఉంటున్న కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించారు. ముంబయి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దాదాపు 56 మందిని విచారించారు. సుశాంత్ మృతి చెందిన తర్వాత రియా తాను సుశాంత్ గర్ల్ఫ్రెండ్నని ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది.
రియాపై ఆరోపణలు
జులై చివరి వారంలో సుశాంత్ కుటుంబసభ్యులు రియాపై పట్నా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుశాంత్ను ఆత్మహత్య చేసుకునేలా ఆమె ప్రేరేపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రియాపై కేసు నమోదైంది. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టింది. ఆగస్టు 9,10 తేదీల్లో రియాను ఈడీ రెండుసార్లు ప్రశ్నించింది. మరోవైపు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. సుశాంత్ సన్నిహితులు, ఇంట్లో పనివారిని విచారించింది. ఈ క్రమంలో సుశాంత్కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుల్లో ప్రధానంగా రియా చక్రవర్తినే విచారిస్తున్నారు.
రియా ఏమంటోంది?
సీబీఐ విచారణపై తనకు పూర్తిగా నమ్మకముందని రియా చక్రవర్తి తెలిపింది. నిజం కచ్చితంగా బయటపడుతుందని చెప్పింది. సుశాంత్ కుటుంబం చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఆపి.. దర్యాప్తు సంస్థలకే ఆ విషయాలు వదిలేస్తే మంచిదని వ్యాఖ్యానించింది. మాదకద్రవ్యాల విషయంపై స్పందిస్తూ ‘నేనెప్పుడూ మాదకద్రవ్యాలు తీసుకోలేదు. సుశాంత్కు మాత్రం మారిజువానా తీసుకునే అలవాటుంది. దాని వాడకం తగ్గించాలని నేను ప్రయత్నించాను’’అని వెల్లడించింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు