Mamta Mohandas: అవ్వన్నీ రూమర్స్‌... తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్..

ప్రముఖ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్ క్యాన్సర్‌తో సుదీర్ఘకాలం పాటు పోరాడి దాని బారి నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల నుంచి ఈ నటి ఆరోగ్యంపై  రూమర్స్‌ వస్తున్నాయి. తాజాగా వాటిపై తన సోషల్‌మీడియాలో స్పందించింది ఈ యమదొంగ భామ. 

Published : 24 Nov 2022 02:01 IST

హైదరాబాద్‌: యమదొంగ సినిమాలో ప్రత్యేకమైన పాత్రతో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసి అలరించింది. కొంతకాలం క్రితం క్యాన్సర్‌ బారిన పడి దానిని జయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోషకాహార నిపుణురాలిగా సోషల్‌ మీడియా ద్వారా ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తోంది. తాజాగా ఈ హీరోయిన్‌కు సంబంధించిన ఓ రూమర్‌ నెట్లో హల్‌ చల్‌ చేస్తుంది. మమతా మోహన్‌దాస్‌ మళ్లీ క్యాన్సర్‌ బారిన పడిందనే ప్రచారం జరుగుతోంది. అవ్వన్నీ రూమర్స్‌ అని  తాను ఆరోగ్యంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్‌.
‘‘నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసి నా అభిమానులు, సన్నిహితులు అందరూ ఆందోళన చెందుతున్నారు. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడం కోసం మెయిల్స్‌ చేస్తున్నారు. నేను ఓ ఇంటర్వ్యూలో నా ఆరోగ్యం బాగాలేదని చెప్పానని, మరోసారి క్యాన్సర్‌ బారిన పడ్డానని చెప్పినట్లు కొందరు యూట్యూబ్‌ ఛానల్స్‌ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ రూమర్స్‌ మాత్రమే నేను ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ క్యాన్సర్‌ బారిన పడలేదు. నా ఆరోగ్యం గురించి నేను చెప్పేవరకు ఎలాంటి వార్తలను నమ్మకండి’’ అంటూ తన లేటెస్ట్‌ ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘నాకు క్యాన్సర్ వస్తే ఇలా ఉంటానా..?’ అంటూ ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని