‘రిపబ్లిక్‌’ టీజర్‌ వచ్చేసింది

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ కథాచిత్రం ‘రిపబ్లిక్‌’. దేవ్‌కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు....

Updated : 05 Apr 2021 12:02 IST

హైదరాబాద్‌: ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం’ అని అంటున్నారు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ కథాచిత్రం ‘రిపబ్లిక్‌’. దేవ్‌కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘రిపబ్లిక్‌’ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ సోమవారం ఉదయం విడుదల చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ నటన, డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీస్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జె.భగవాన్‌ నిర్మాత. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయిక. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని