Konda: మన కథలు మనం చెప్పే రోజులొచ్చాయి

త్రిగుణ్‌, ఇర్రామోర్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించారు.

Updated : 20 Jun 2022 08:18 IST

త్రిగుణ్‌, ఇర్రామోర్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించారు. కొండా సుస్మితా పటేల్‌ నిర్మాత. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల వరంగల్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘కొండా మురళి, కొండా సురేఖల జీవితాల్ని రెండు గంటల్లో నాకు  వీలైనంత బాగా తెరకెక్కించా. సురేఖ మాటల్లో చూపిస్తే... మురళి చేతల్లో చూపిస్తారు. రెండూ ముఖ్యమే. వారి పాత్రల్లో త్రిగుణ్‌, ఇర్రామోర్‌ చాలా బాగా నటించారు. ప్రధాన ప్రతినాయకుడిగా నటించిన అభిలాష్‌ని మరిన్ని సినిమాల్లో చూడనున్నాం’’ అన్నారు. త్రిగుణ్‌ మాట్లాడుతూ ‘‘వరంగల్‌లో కొండా అనేది పేరు కాదు, ఓ భావోద్వేగం. సినిమాలో ఆ భావోద్వేగాన్ని పండించే అవకాశం నాకు లభించింది’’ అన్నారు. మన కథలు మనం చెప్పే రోజులొచ్చాయని,   కొండా దంపతుల ఉద్యమ ప్రయాణంతో ఈ సినిమా తెరకెక్కిందన్నారు కొండా సుస్మితా పటేల్‌. ఈ కార్యక్రమంలో కొండా మురళి,   కొండా సురేఖ, సుచిత్రా చంద్రబోస్‌, అభిలాష్‌, పార్వతి, ఆటో రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని