RGV: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్జీవీ.. అది నేను కాదంటూ ట్వీట్‌‌..!

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్జీవీ

Published : 20 Mar 2022 18:12 IST

హైదరాబాద్‌: పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భాగమవుతోన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ భాగమయ్యారు. ఆదివారం ఉదయం తన టీమ్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు సంబంధించిన ఓ ఫొటోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ.. అది తాను కాదంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఫొటోలో ఉన్నది నేను కాదు. ఎందుకంటే నాకు మొక్కలన్నా, మట్టన్నా నచ్చదు’’ అని రాసుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని