Rishab Shetty: ‘కాంతార - 2’ రానుందా..? రిషబ్‌ శెట్టి ఏం చెప్పారంటే

‘కాంతార-2’ పై నటుడు రిషబ్‌శెట్టి స్పందించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కాంతార-2’ గురించి మాట్లాడారు. 

Published : 16 Oct 2022 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కాంతార’తో (Kantara) సూపర్‌హిట్‌ అందుకున్నారు కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty). ప్రకృతి నేపథ్యంలో సిద్ధమైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాధారణ చిత్రంగా విడుదలై కన్నడ బాక్సాఫీస్‌ వద్ద విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ‘కాంతార’ చిత్రాన్ని హిందీ, తెలుగులోనూ చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రిషబ్‌ శెట్టి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘కాంతార-2’పై విలేకరి ప్రశ్నించగా.. ‘నో కామెంట్స్‌’ అని బదులిచ్చారు.

‘‘కాంతార -2’ గురించి ప్రస్తుతానికి ఏం చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతం ‘కాంతార’ సమయం నడుస్తోంది. ఇది ప్రకృతికి సంబంధించిన కథ కాబట్టి దీనిలో ఉపకథలను చూపించడానికి అవకాశం ఉంది. రక్షిత్‌ శెట్టితో నేను తెరకెక్కించిన ‘కిర్రాక్‌పార్టీ’కి త్వరలో సీక్వెల్‌ చేస్తా. కొత్త కథతో దీన్ని రూపొందిస్తున్నా’’ అని రిషబ్‌ తెలిపారు. అనంతరం ఆయన తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలందరిపై తనకి అభిమానం ఉందని, ఎన్టీఆర్‌ అంటే ప్రత్యేకమైన ఇష్టమని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని