‘రొమాంటిక్‌’గా వచ్చేది ఆ రోజే!

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌, కేతిక శర్మ జంటగా వస్తున్న చిత్రం ‘రొమాంటిక్‌’. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ తేదీని నిర్మాతల్లో ఒకరైన ఛార్మీకౌర్ ప్రకటించారు. జూన్‌ 18నుంచి థియేటర్లలో ఈ ‘రొమాంటిక్‌’ జంట

Published : 01 Mar 2021 16:05 IST

హైదరాబాద్: డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌, కేతిక శర్మ జంటగా వస్తున్న చిత్రం ‘రొమాంటిక్‌’. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ తేదీని నిర్మాతల్లో ఒకరైన ఛార్మీకౌర్ ప్రకటించారు. జూన్‌ 18నుంచి థియేటర్లలో ఈ ‘రొమాంటిక్‌’ జంట కనువిందు చేయనున్నారు. పూరి కనెక్ట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ శిష్యుడు అనీల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఆకాశ్‌ ‘జార్జిరెడ్డి’ ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో ‘చోర్‌ బజార్‌’అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్‌ కూడా మొదలుపెట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని