భయపెట్టి నవ్వులు పంచుతోన్న ‘రూహీ’

రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రూహీ’.  హార్దిక్‌ ‌ మెహతా దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.  

Published : 16 Feb 2021 14:42 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రూహీ’.  హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.  హారర్‌, కామెడీ సమపాళ్లలో చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. జాన్వీ నటన ప్రధానంగా నిలుస్తుంది.

ఇద్దరు యువకులు నాయికను కిడ్నాప్‌ చేసి ఓ అడవిలో నిర్బంధిస్తారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించే సందర్భాల్లో ఒక్కోసారి భయపెడుతుంది.. మరోసారి సాధారణంగా ఉంటుంది జాన్వీ. అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఆమెలో ఎవరి ఆత్మ ప్రవేశించింది? ఆమె నుంచి రక్షించుకునేందుకు ఆ యువకులు ఏం చేశారు? అసలు జాన్వీని కిడ్నాప్‌ ఎందుకు చేశారు? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. దినేష్‌ విజన్‌, మృఘ్‌దీప్‌ సింగ్‌ లంబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సచిన్‌-జిగర్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని