Corona: ఉద్వేగానికి లోనైన ఆర్పీ పట్నాయక్
కొవిడ్ వల్ల దేశంలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ...
వైరల్గా మారిన వీడియో
హైదరాబాద్: కొవిడ్ వల్ల దేశంలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ కొన్నిరోజులపాటు ఇళ్లలోనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్ పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తాజాగా ఆయన ఓ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఎంతో బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనని సాయం కోరిన వారికి సైతం సాయం అందించలేని పరిస్థితులు ఆసుపత్రుల వద్ద నెలకొన్నాయన్నారు.
‘బయట పరిస్థితులు చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఒకప్పుడు మనం వుహాన్ని చూసినట్లు ఇప్పుడు భారత్ని ప్రపంచం చూస్తోంది. తన తల్లికి సరైన సమయంలో బెడ్ దొరకకపోవడం వల్ల చనిపోవడంతో ఓ వ్యక్తి వెళ్లి ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశాడు. ఒక్కటి ఆలోచించండి ఆసుపత్రిలో పడకలు అందుబాటులో లేనప్పుడు వైద్యులు మాత్రం ఏం చేయగలరు. ఇలాంటి ఘటనలు ఎన్నోచోట్ల జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు లేక చనిపోయేవాళ్ల కన్నా ఆక్సిజన్ అందక చనిపోయేవాళ్లు ఎక్కువయ్యారు. ఇవన్నీ వాస్తవాలు. మనం వినకూడదు అనుకున్నా వినాల్సిన నిజాలు. ఎంతోమంది తమ తల్లిదండ్రుల్ని, కుటుంబసభ్యుల్ని కోల్పోతున్నారు. నాకు ఎంతోమంది సాయం కోసం పోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాళ్లకు అవసరమైన సాయాన్ని చేయలేకపోతున్నందుకు బాధగా అనిపిస్తుంది. ప్రతిరోజూ కొవిడ్ కేసుల గురించి మనం వింటున్న లెక్కలు నిజం కాదు. నిజమైన లెక్కలు తెలియాలంటే ఒక్కసారి శ్మశానాలకు వెళ్లండి. ఇంత జరుగుతున్నా.. ఎలక్షన్స్ ముఖ్యం, ఫలితాల లెక్కింపు ముఖ్యం అనే దౌర్భాగ్యస్థితిలో మన రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంతమంది మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీరు అస్సలు మనుషులేనా? ఎన్నికలు అయిపోయాయి కదా.. ఎన్నికలపై మీరు చూపిన శ్రద్ధలో కేవలం ఒక్కశాతమైన ఇప్పుడు ప్రజలపై చూపించండి. దయచేసి మీకు మొక్కుతున్నా. ఉన్నవాళ్లనైనా కాపాడే ప్రయత్నం చేయండి. మృతుల్ని చూసి వైద్యులు సైతం తల్లడిల్లిపోతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.