RRR Cinema: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. వాళ్లందరికీ ఉచితం!

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా విడుదలైన ఈ సినిమా రూ.1100 కోట్లు వసూలు చేసింది.

Updated : 19 May 2022 20:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా విడుదలైన ఈ సినిమా రూ.1100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ చిత్రం మే 20 నుంచి ‘జీ5’లో ప్రేక్షకులను అలరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులకు చిత్ర బృందం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అదనంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఓటీటీలో ఈ సినిమాను వీక్షించే అవకాశం కల్పించింది.

జీ5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారు ఈ సినిమాను చూడచ్చు అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా చిత్రబృందం పేర్కొంది. ‘ప్రేక్షకుల కోరిక మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను జీ5 సబ్‌స్క్రైబర్లు అందరూ ఉచితంగా చూడొచ్చు’ అని పేర్కొంది. ఈ సినిమాను చూడాలంటే జీ5 సబ్‌స్క్రైబర్లు కూడా అదనంగా రూ.100 చెల్లించాలని గతంలో పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఉచితంగా అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని