Pushpa 2: ‘పుష్ప-2’లో రామ్చరణ్.. స్క్రీన్పై మెరవనున్న బావా-బామ్మర్ది..?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప -2’ రానుంది.
ఇంటర్నెట్డెస్క్: ఐకాన్స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్స్టార్ రామ్చరణ్ (Ram Charan).. వీరిద్దరూ ఒకే స్క్రీన్పై కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘ఎవడు’ వచ్చినప్పటికీ అందులో చరణ్-బన్నీ కలిసి కనిపించిన సన్నివేశాల్లేవు. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ వెండితెరపై కలిసి సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేజికల్ కాంబోకు ‘పుష్ప-2’ (Pushpa 2) వేదిక కానుందని వార్తలు వస్తున్నాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన బ్లాక్బస్టర్ హిట్ ‘పుష్ప ది రైజ్’. బన్నీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది. అయితే ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. పార్ట్-1తో పోలిస్తే.. పార్ట్-2 మరింత ఆసక్తికరంగా ఉండనుందని, ఇందులో ఎంతోమంది స్టార్స్ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు రామ్చరణ్ సైతం ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని, బన్నీతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని.. నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై సుకుమార్ ఇప్పటికే చెర్రీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
డైలాగ్ అదుర్స్ అప్పా..!
‘పుష్ప’లో పవర్ఫుల్ పంచ్ డైలాగ్లు, విభిన్నమైన స్టైల్లో మెప్పించారు అల్లు అర్జున్. ‘తగ్గేదే లే’, ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’.. ఇలా చెబుతూ వెళితే ఆ సినిమాలో ఎన్నో సంభాషణలు అభిమానులను అలరించాయి. దీంతో ‘పుష్ప-2’లోనూ పవర్ఫుల్ డైలాగ్స్ మెండుగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం’’. ప్రస్తుతం ఈ డైలాగ్ సినీ ప్రియులతో ఈలలు వేయిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.