Cinema News: ‘రుద్ర సింహ’ ప్రతీకారం

సంతోష్‌, స్నేహ, మైత్రి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘రుద్ర సింహ’. మనోహర్‌ కాటేపోగు తెరకెక్కించారు. ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, మనోహర్‌, కోటేశ్వర్‌రావు జింకల సంయుక్తంగా నిర్మించారు. ఈ సిని

Updated : 02 Jul 2022 07:13 IST

సంతోష్‌, స్నేహ, మైత్రి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘రుద్ర సింహ’ (Rusra Simha). మనోహర్‌ కాటేపోగు తెరకెక్కించారు. ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, మనోహర్‌, కోటేశ్వర్‌రావు జింకల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో నటులు సుమన్‌, భానుచందర్‌ చిత్ర పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన యాక్షన్‌ రివేంజ్‌ డ్రామా. ఇందులో ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. సినిమా చూసి ప్రేక్షకులు కచ్చితంగా భావోద్వేగానికి గురవుతారు. థ్రిల్‌గా ఫీలవుతారు’’ అన్నారు. ‘‘మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో సంతోష్‌. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘లవ్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌తో నిండిన చిత్రమిది. మనోహర్‌ చక్కగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు. కార్యక్రమంలో సముద్ర, రవికుమార్‌ చౌదరి, శోభారాణి, అభి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని