Rudra: ట్రైలర్‌తో అజయ్‌ దేవ్‌గణ్‌.. పాటతో శర్వానంద్‌!

ప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, టాలీవుడ్‌ నటుడు శర్వానంద్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాను నటించిన ‘రుద్ర’ సినిమా  ట్రైలర్‌ను అజయ్‌ దేవగణ్‌, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలోని రెండో పాటను శర్వానంద్‌ కానుకగా అందించారు. 

Published : 14 Feb 2022 22:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, టాలీవుడ్‌ నటుడు శర్వానంద్‌ ప్రేమికుల రోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాను నటించిన ‘రుద్ర’ సినిమా ట్రైలర్‌ను అజయ్‌ దేవగణ్‌, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలోని రెండో పాటను శర్వానంద్‌ కానుకగా అందించారు.

తొలిసారిగా..

అజయ్‌ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘రుద్ర’. రాజేశ్‌ మపుస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అజయ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాశీఖన్నా కథానాయిక. బ్రిటిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా చేసుకొని ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను రూపొందించారు. ముంబయి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్‌ని హీరో ఎలా పట్టుకోగలిగాడు? అనే కథాంశంతో రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓ మై ఆద్య..

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల దర్శకుడు. ‘ఓ మై ఆద్య’ అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీమణి రచించిన ఈ పాటను యాజిన్‌ నైజర్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని