Sai chand: నేను నాన్న.. ఆమె కన్నా
ఇంత మంది సూపర్ హీరోలు కలిసిన ఆయన నా జీవితానికి నిజమైన నాయకుడు. బిడ్డలు శిల్పాల్లా నిలవడానికి... ఉలి దెబ్బలు తిని రాలి పడిన..
నేను ఓ బిడ్డనైతే చాలు... నన్ను హీరోలా చూసేది నాన్న
నేను హీరోనైతే... ఆయన నా తొలి అభిమాని
నేను దర్శకుడినైతే... ఆయన నాకు చప్పట్లు కొట్టే ప్రేక్షకుడు
నేను సినిమానైతే... ఆయన నన్ను నిర్మించే నిర్మాత.
నేను రోజూ చదివే పుస్తకం... నా గెలుపులో ఎగరవేసే పతాకం... నాన్న!
నాకు భయమేస్తే... ధైర్యం చెప్పే హీమెన్
నాకు కష్టమొస్తే... కాచుకోగల ఐరెన్మెన్
నాకు కన్నీళ్లొస్తే.. తుడిచేసే స్పైడర్మెన్
నాకు ఓటమొస్తే... గెలిచేదాకా నన్ను మోసే సూపర్మెన్
ఇంత మంది సూపర్ హీరోలు కలిసిన ఆయన నా జీవితానికి నిజమైన నాయకుడు. బిడ్డలు శిల్పాల్లా నిలవడానికి... ఉలి దెబ్బలు తిని రాలి పడిన.. నాన్నలందరికీ తండ్రులదినోత్సవ శుభాకాంక్షలు!
అందరి జీవితాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న నాన్నల గురించి స్మరించే రోజు పితృ దినోత్సవం. తెలుగు చిత్రసీమలో తండ్రి పాత్రలకి కేరాఫ్గా నిలుస్తున్నారు సాయిచంద్. ‘ఫిదా’, ‘ఉప్పెన’, ‘కొండపొలం’, ‘విరాటపర్వం’ సినిమాల్లో నాన్నగా ఆయన గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. నిజ జీవితంలో నాన్న పాత్రకి దూరంగా ఉన్న ఆయన సినిమా నాన్నగా పలు విషయాల్ని ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...‘‘చాలా సినిమాల్లో నాన్న పాత్రల్ని చూస్తుంటాం. వాటిలో కొన్నే మనసుల్ని తాకుతాయి, హృదయాల్లో నిలిచిపోతాయి. అలా నా మనసులో నిలిచిపోయింది ‘మహానది’ సినిమాలో కమల్హాసన్ పాత్ర. కూతురు కోసం అన్వేషించే తండ్రిగా అందులో కనిపిస్తారు. ఇక దక్షిణాదిలోనే నాకు అత్యంత ఇష్టమైన నటుడంటే ఎస్వీ రంగారావు. ఆయన చేసిన ప్రతీ పాత్ర ఇష్టమే. తండ్రి, తాత పాత్రల్లో గొప్ప ఆర్ధ్రతని పండించారు. వారి నటనని చూసి ఆస్వాదించడమే తప్ప, నేను తండ్రిగా నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిజ జీవితంలో నేను ఒంటరినే. రెండున్నర దశాబ్దాలకిపైగా నటనకి దూరంగా ఉన్న సమయంలో శేఖర్ కమ్ముల ‘ఫిదా’లోని తండ్రి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. మాది ఉమ్మడి కుటుంబం. మేం మొత్తం ఆరుగురం. నేను చిన్నవాణ్ని. అక్క పిల్లలు, అన్నయ్య పిల్లలు నా ఒళ్లోనే పెరిగారు. కానీ తండ్రి అనుభూతి ఎలా ఉంటుందో, దాన్ని పక్కాగా తెరపైన చూపిస్తానో లేదో అనే భయం ఉండేది. అందుకే శేఖర్ కమ్ముల ‘ఫిదా’లో తండ్రిగా చేయాలని అడిగినప్పుడు సంకోచించా. ‘మీరు 21 ఏళ్లు ఉన్నప్పుడే ‘మా భూమి’లో తెలంగాణ రైతాంగ పోరాట నాయకుడి పాత్ర చేశారు, ఈ పాత్రనీ అలవోకగా చేస్తారు’ అన్నాడు. ఆయన నమ్మకంగా ఉన్నా, నేను అన్యమనస్కంగానే ఒప్పుకున్నా. ఆ తర్వాత నాకు కూతురుగా నటించేదెవరు? అని అడిగితే ‘ప్రేమమ్’ కథానాయిక సాయిపల్లవి అని చెప్పారు. అప్పటికి నేను ఆ సినిమా చూడలేదు. సాయిపల్లవి ఫొటోని చూపించారు. ఆ ఫొటో చూడగానే నా మనసు ‘నువ్వు చేయాల్సిందే...’ అని చెప్పింది. 15 రోజుల తర్వాత శేఖర్ కమ్ముల రిహార్సల్స్ కోసం నన్ను, సాయిపల్లవిని పిలిచారు. ఓ సన్నివేశంలో నటించి చూసుకుని తిరిగొస్తున్నప్పుడు ‘నాన్న... మనం మళ్లీ కలుద్దాం’ అంటూ నా దగ్గరికొచ్చింది. నాన్నా.. అని సాయిపల్లవి పిలవగానే నాలో తండ్రితనం బయటికొచ్చిందో ఏమో అప్పట్నుంచి నిజమైన తండ్రీ కూతుళ్లే అయిపోయాం. ఆ అమ్మాయికి తండ్రిగా నటించడం సృష్టి ఇచ్చిన ఓ అపూర్వమైన కానుక అనిపించింది. ప్రతీ విషయంలోనూ శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టా. స్క్రిప్ట్లో భాను అనే పేరే తప్ప తల్లీ, బిడ్డ అనే మాటలు లేవు. నాలో తండ్రితనం వచ్చేసింది కదా అందుకే ‘అది కాదు బిడ్డా, అలా కాదు తల్లీ’ అంటూ సంభాషణల్ని తిరిగి రాసుకుని చెప్పా. శేఖర్ కమ్ముల ఎంతగా మెచ్చుకున్నారో! నిజ జీవితంలో నా చిన్న వయసులోనే మా అమ్మానాన్నలు చనిపోయారు. పిల్లలపై అది ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు తెలుసు.
‘ఫిదా’లో నా కూతుళ్లకి తల్లి ఉండదు. నాన్నంటే నాన్నే కాదు, ఆయనలో అమ్మ ఉంటుంది. అందుకే అమ్మతనాన్ని జోడిస్తూ ఇద్దరి కూతుళ్లకి తండ్రిగా ఆ పాత్ర చేశా. మీరు గమనిస్తే తండ్రిగా ఆవేశపడినా, ఆ వెంటనే అనునయాన్ని ప్రదర్శిస్తుంటుందా పాత్ర. ‘ఉప్పెన’లోనూ అంతే. అందులో కథానాయకుడికి అమ్మ ఉండదు. అందుకే అమ్మతనాన్ని జోడిస్తూ ఆ పాత్ర చేశా. ఓ సందర్భంలో ‘ఒరేయ్... అమ్మే చెప్పిందనుకోరా’ అనే డైలాగ్ చెబుతాను. ఆ సినిమాల విడుదల తర్వాత మా నాన్నని మీ పాత్రల్లో చూసుకున్నాం అని చెప్పినవాళ్లు ఎంతోమంది. ‘ఫిదా’ తర్వాత ఆ పాత్ర అలా నిలిచిపోవాలనుకున్నా. అందుకే ఆ తర్వాత 50 సినిమాలకి తండ్రి పాత్రల కోసం అవకాశాలు వచ్చాయి. అన్నిటినీ తిరస్కరించి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలకమైన పాత్ర ఒప్పుకొన్నా. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడే చిరంజీవి పిలిచి ‘ఉప్పెన’లో తండ్రి పాత్ర గురించి చెప్పారు. ఎలాగోలా తప్పించుకోవాలని ‘సైరా నరసింహారెడ్డి’ పాత్ర కోసం గడ్డం పెంచాను, ‘ఉప్పెన’ చేయలేనని చెప్పా. ఆయన ‘లేదు, ఈ పాత్ర బాగుంటుంద’ని నన్ను ఒప్పించారు. సాయిపల్లవి ‘కొడుకు పాత్రకీ తండ్రిగా నటించండి నాన్నా’ అని చెప్పింది. ఆ సినిమాతోనూ చాలా పేరొచ్చింది. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. వైష్ణవ్కి ‘కొండపొలం’లోనూ తండ్రిగా నటించా. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ... ఇలా అన్ని యాసలూ పలికే అవకాశాన్ని తండ్రి పాత్రలే ఇచ్చాయి. వేణు ఊడుగుల నాకు ఎప్పట్నుంచో పరిచయం. ‘విరాటపర్వం’ కోసం రాముడు అనే మరో గొప్ప తండ్రి పాత్రని సృష్టించారు. ఆ పాత్రలో మరోసారి సాయిపల్లవికి తండ్రిగా నటించడం గొప్ప అనుభవం. నాన్నా, మళ్లీ కలుస్తామో లేదో... అంటూ సాయిపల్లవి అడవుల్లోకి వెళ్లే సన్నివేశం నా మనసుని పిండేసింది. అదేమిటో తెలియదు కానీ... ఎవరితో కలిసి నటించినా సన్నివేశం పూర్తయ్యాక మామూలుగా మారిపోతాను. సాయిపల్లవితో కలిసి నటించాక తొందరగా ఆ ప్రభావం నుంచి బయటికి రాలేను. సాయిపల్లవి నా జీవితంలోకి వచ్చాక తండ్రిగా నేను మిస్ అయిన అనుభూతులన్నీ ఆ అమ్మాయి ఇచ్చింది. ఇప్పటికీ ఆమె నన్ను నాన్న అనే పిలుస్తుంది, నేను కన్నా అంటుంటా. నేను జీవితంలో తండ్రి కాకపోయినా... నాన్నగా మారిపోయా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు. -
నాలుగు క్యారవాన్లు ఇస్తే కానీ సెట్లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ తారలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి. -
వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా
తన పీఆర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?