SaiDharam Tej: అమ్మా నన్ను క్షమించు.. సాయితేజ్ ఎమోషనల్
సాయిధరమ్ తేజ్, కార్తిక్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. తాజాగా ఈసినిమా టైటిల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయితేజ్ భావోద్వేగానికి గురయ్యారు.
హైదరాబాద్: బైకు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) నటించిన సరికొత్త చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తిక్ దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. తారక్ (NTR) వాయిస్ ఓవర్తో సాగిన ఈ టైటిల్ గ్లింప్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయి తేజ్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లికి క్షమాపణలు చెప్పారు.
‘‘నేను ఈ స్టేజ్పై నిల్చొనేలా చేసి, నాకు ఓర్పు, సహనం నేర్పించిన మా ముగ్గురు మావయ్యలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. వాళ్ల ప్రేమాభిమానం వల్లే నేను ఇక్కడ ఉన్నా. అమ్మా.. ఆస్పత్రిలో బెడ్పై ఉన్నప్పుడు నీకో విషయం చెప్పలేకపోయా.. ఇప్పుడు చెబుతున్నా.. ‘ఐ యామ్ సారీ, అలాగే లవ్ యూ అమ్మా’. నేను ఈ సినిమా చేసింది, ఇంత కష్టపడింది నీకోసమే. డియర్ తారక్.. 2007లో మొదటిసారి నిన్ను కలిసినప్పుడు ఎంత ప్రేమను చూపించావో ఇప్పటికీ అలాగే నన్ను ప్రేమగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు చూపించిన ప్రేమ, చేసిన సాయాన్ని మాటల్లో వర్ణించలేను. ఎవరు ఏమైనా అనుకోని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని సాయి తేజ్ తెలిపారు.
ఇది మూఢ నమ్మకాలకు సంబంధించిన చిత్రం కదా. చిన్నప్పుడు మీరు నమ్మిన మూఢ నమ్మకం ఏమిటి?
సాయితేజ్: మూఢ నమ్మకం అని కాదు. చిన్నప్పటి నుంచి నేను ఆంజనేయస్వామిని నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉంటారని భావిస్తాను.
బైకు ప్రమాదం తర్వాత మీరు నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం మీరు ఎంతలా కష్టపడ్డారు?
సాయితేజ్: ప్రమాదం చిన్నదే అయినప్పటికీ.. దాని ప్రభావం నాపై ఎక్కువగా పడింది. దాని నుంచి కోలుకోడానికి సుమారు ఆరు నెలలు సమయం పట్టింది. దర్శకుడు కార్తిక్.. కథతోపాటు నా పాత్ర ఎలా ఉంటుంది?ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? ఇలా ప్రతీది ఎంతో క్షుణ్ణంగా వివరించాడు.
‘విరూపాక్ష’ అంటే కనిపించని మూడోకన్ను అన్నారు. చిరంజీవి నటించిన ‘త్రినేత్రుడు’తో దీనికి ఏదైనా సంబంధం ఉందా?
కార్తిక్: అలా ఏమీ లేదు. రెండూ విభిన్నమైన కథలు.
మీ తదుపరి చిత్రాలు ఎలా ఉండనున్నాయి?
సాయితేజ్: ప్రేక్షకులకు మంచి థియేటర్ అనుభవాన్ని అందించడం కోసం కష్టపడుతున్నాను.
నిర్మాత ప్రసాద్తో మీరు వరుస సినిమాలు చేస్తున్నారు కదా. తదుపరి చిత్రం కూడా అదే బ్యానర్లోనా?
సాయితేజ్: అవును. నా తదుపరి ప్రాజెక్ట్ ఆయనతోనే చేస్తున్నా. ఆయనను, బాపి అన్నయ్యను వదిలే ప్రసక్తే లేదు.
ఎన్టీఆర్తో వాయిస్ ఓవర్ ఇప్పించాలనే ఆలోచన ఎవరిది?
సాయితేజ్: టీమ్ అందరిది. మేమంతా అనుకొని, ఈ డైలాగ్కు తారక్ వాయిస్ సరిపోతుందని ఫిక్స్ అయ్యాం. ఆయన్ని కలిశాం. ఆయన వెంటనే ఓకే అన్నారు.
పాన్ ఇండియా మార్కెట్లోకి మీరు కూడా ప్రవేశిస్తున్నారని అనుకోవచ్చా?
సాయితేజ్: ఇది యూనివర్సల్ స్క్రిప్ట్. అందుకే దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు.
ఈ కథ ఎప్పుడు ఓకే చేశారు?
సాయితేజ్: 2018లోనే ఈ కథ విన్నా. అప్పటికి వేరే సినిమా షూట్లో ఉండటం వల్ల కాస్త లేట్ అయ్యింది. మధ్యలో కరోనా, తర్వాత చిన్న ప్రమాదం.. దాని వల్ల షూట్ ఆలస్యంగా ప్రారంభించాం.
వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తీశారా?
కార్తిక్: పేపర్లో ఎన్నో కథనాలు చదివాను. అందులో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది. దానిని ఆధారంగా చేసుకుని ఈ ఫిక్షనల్ కథ రాశా.
మీ సినిమాలో మళ్లీ సాంగ్ రీమేక్ చేస్తారా?
సాయితేజ్: సాంగ్స్ రీమేక్ చేయడం నేను ఎప్పుడో ఆపేశాను. దర్శకుడు కోరితే చేస్తాను తప్ప.. నా సొంతంగా అలాంటి ప్రయత్నాలు చేయను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్తో విజయ్.. టైటిల్స్తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం