Sai Dharam Tej: క్రికెట్ ఆడుతూ అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా..!

బైక్‌ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) నటిస్తోన్న చిత్రం ‘విరూపాక్ష’. కార్తిక్‌ దర్శకుడు.  ఈ సినిమా టీజర్‌ బుధవారం విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా వాయిదా పడింది.

Updated : 01 Mar 2023 14:47 IST

హైదరాబాద్‌: నటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయన నటించిన సరికొత్త సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha) టీజర్‌ విడుదల వాయిదా పడింది. సాయిధరమ్‌ తేజ్‌ భీమవరం అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న రావూరి పండు (28) మంగళవారం క్రికెట్‌ ఆడుతూ.. గుండెపోటు రావడంతో మృతి చెందాడు. పండు మృతితో దిగ్భ్రాంతికి గురైన సాయి.. ‘విరూపాక్ష’ టీజర్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీజర్‌ విడుదలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని టీమ్‌ వెల్లడించింది.

‘రిపబ్లిక్‌’ (Republic) తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తోన్న చిత్రమిది. కార్తిక్‌ దండు దర్శకుడు. సంయుక్త కథానాయిక. సుకుమార్‌ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం సాయంత్రం పవన్‌కల్యాణ్‌ వీక్షించారు. చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. బుధవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాల్సివుండగా పండు మృతితో  వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని