BRO: మార్క్ అలియాస్ మార్కండేయులు
పవన్ కల్యాణ్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. జీ స్టూడియోస్తో కలిసి టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జీ స్టూడియోస్తో కలిసి టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే పవన్ ఫస్ట్లుక్ బయటకు వదలగా.. సాయిధరమ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను మంగళవారం విడుదల చేశారు. ఆయన ఈ సినిమాలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారు. మోషన్ పోస్టర్లో తేజు శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో స్టైలిష్గా కనిపించగా.. ‘‘బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం’’ అంటూ బ్యాగ్రౌండ్లో వినిపించిన శ్లోకం ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా