చరణ్‌-శంకర్‌ మూవీ: డైలాగ్‌లు మామూలుగా పేలవు!

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర

Published : 13 Jul 2021 17:36 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందించనున్నారు. ప్రస్తుతం తెలుగులో బిజీగా రచయితల్లో సాయిమాధవ్‌ ఒకరు. పలు భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఆయన పని చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘హరిహర వీరమల్లు’ సహా ఇంకా కొన్ని చిత్రాలకు మాటలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

‘జెంటిల్‌మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. థ్యాంక్స్‌ శంకర్‌ సర్‌, దిల్‌రాజు గారు, చరణ్‌బాబు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే చరణ్‌-శంకర్‌ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తారని టాక్‌. ‘ఒకే ఒక్కడు’ తరహాలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని తెలుస్తోంది. కథకు తగిన విధంగా పదునైన సంభాషణలు అందించటంటో సాయిమాధవ్‌ సిద్ధహస్తులు. అందుకే చిత్ర బృందం ఆయనను ఎంపిక చేసిందట. మరి సాయిమాధవ్‌ కలం నుంచి జాలువారిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు చరణ్‌ నోటి నుంచి వినాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని