Sai Pallavi: నాకు మాత్రమే తెలిసిన విషయం.. ఇప్పుడు ప్రపంచం తెలుసుకోనుంది

నటి  సాయిపల్లవి చెల్లెల్లు పూజ కన్నన్‌ మొదటి సినిమా  ‘చిత్తిరై సేవానమ్‌’ నేడు (శుక్రవారం) జీ5 ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published : 03 Dec 2021 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈరోజు తనకు చాలా ప్రత్యేకం అని అంటున్నారు ప్రముఖ నటి సాయి పల్లవి. తన చెల్లెల్లు పూజ కన్నన్‌ మొదటి సినిమా  ‘చిత్తిరై సేవానమ్‌’ నేడు (శుక్రవారం) జీ5 ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పూజకు విషెస్‌ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ రాసింది.

‘‘పూజా.. నీ గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా తెలుసుకోనుంది. ఆరోగ్యం బాగోలేదని అమ్మనాన్నకు చెప్పి బంక్‌ కొట్టడం, నిరాశగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ముందుకు వెళ్లడం.. ఇలా ఆఫ్‌స్ర్కీన్‌లోనే కాదు.. ఇప్పుడు ఆన్‌స్ర్కీన్‌లోనూ నటిగా ఎదిగావ్‌’’

‘‘ఈరోజు నీ మొదటి చిత్రం విడుదలవుతోంది. ఐ లవ్‌ యూ. నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటా. జీవితంలో నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ప్రేక్షకులు ఆదరణ చూపించేటప్పుడు అంతే సంతోషంగా ఉంటుంది. నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతా’’ అని ప్రేమను వ్యక్తపరిచింది. జీ తమిళ్‌, అమిర్తా, థింక్‌ బిగ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ తమిళ చిత్రంతో శిల్వ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని