నాగార్జున అంటే చాలా ఇష్టం: సయామీ
సయామీ ఖేర్ తెలుగులో ‘రేయ్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో ‘మిర్జ్యా’ అనే చిత్రం చేసింది. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు.
హైదరాబాద్: తెలుగులో ‘రేయ్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన భామ సయామీఖేర్. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో నటిగా అలరిస్తోంది. తాజాగా నాగార్జునతో కలిసి ‘వైల్డ్డాగ్ ’లో నటించింది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్ పంచుకున్న విశేషాలు మీకోసం...
తొలుత ఈ సినిమా గురించి మిమ్మల్ని ఎవరు సంప్రదించారు?
సయామీ: ముందుగా చిత్ర దర్శకుడు అహిషోర్ సాల్మన్ ‘వైల్డ్ డాగ్’ గురించి చెప్పారు. ఇదొక యాక్షన్ చిత్రం.
తెలుగులో ఇది ఎన్నో సినిమా?
సయామీ: నేను తెలుగులో మొదటగా ‘రేయ్’ చిత్రంలో నటించాను. ఆ తర్వాత ఇప్పుడు నాగార్జున్తో కలిసి ‘వైల్డ్ డాగ్’లో నటిస్తున్నా.
నాగార్జునతో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తోంది?
సయామీ: ప్రతి ఒక్క నటి నాగార్జునతో కలిసి పనిచేయాలని కోరుకుంటుంది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘గీతాంజలి’ సినిమా అంటే ఎంతో ఇష్టం. గతంలో నాగ్సర్ని ఎప్పుడూ కలవలేదు. తొలిసారిగా సెట్లోనే కలుసుకున్నా.
ఈ చిత్రంలో మీ మొదటి సన్నివేశం ఎక్కడ చిత్రీకరించారు?
సయామీ: ఇందులో నా మొదటి సన్నివేశం గోడౌన్లో టెర్రిరిస్టుల్ని ఇంటరాగేట్ చేస్తుంటారు. తొలుత ఎలా ఉంటుందా అని టెన్షన్ పడ్డాను. కానీ, నాగార్జునతో కలిసి నటిస్తుంటే చాలా సరదాగా ఉంది. సెట్లో నాగ్ (సర్) అందరితోనూ సరదాగా ఉంటారు. ఫుల్గా ప్రాక్టికల్ జోకులు వేస్తూ నవ్విస్తుంటారు.
మీరు రెగ్యులర్గా చేసే పాత్రలకు ఈ యాక్షన్ చిత్రానికి పూర్తి భిన్నం. ఎలా చేశారు?
సయామీ: నేను చిన్నప్పట్నుంచి క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. మారథాన్లో రన్నర్ని. క్రీడల్లో నాకు చాలా పట్టుంది. సినిమా కోసం ముంబయి మార్షల్ ఆర్ట్స్ లో నెలపాటు శిక్షణ కూడా తీసుకున్నా.
ఈ చిత్రంలో మీ పాత్ర ఏంటి?
సయామీ: ఇందులో నా పాత్ర పేరు ఆర్య పండిట్. రా ఏజెంట్. నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మగా కనిపిస్తారు. మేమంతా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తుంటాం.
మీరు క్రీడా నేపథ్యం నుంచి వచ్చారు కదా? ఈ చిత్రంలో మీకు అది ఎంతవరకు ఉపయోగపడింది?
సయామీ: మనలో ఎవరికైనా బాడీ ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఇది యాక్షన్ చిత్రం. కొవిడ్-19 తర్వాత చాలా చోట్ల సినిమా షూటింగ్ చేశారు. అడవుల్లో పనిచేయడం, పరిగెత్తడం లాంటి కష్టమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. వీటిని అధిగమించడానికి నా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ ఎంతో ఉపయోగపడింది.
ఈ చిత్రంలో మీకేమైనా పాటలు, హాస్య సన్నివేశాలు ఉన్నాయా?
సయామీ: ఇందులో అలాంటి ఏమీ లేవు. పూర్తిగా యాక్షన్ చిత్రం. ఈ కథ నాకెంతగానో నచ్చింది. కొవిడ్ సమయంలోనే సినిమా షూటింగ్ మనాలిలో జరిగింది.
మీకు ఇష్టమైన నటులు ఎవరు? ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు?
సయామీ: రాజమౌళి అంటే ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. తాజాగా రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సీతారామరాజు లుక్ చూశా. చాలా బాగుంది. హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్, దర్శకుల్లో మణిరత్నం, తరుణ్ భాస్కర్లతో పనిచేయాలని ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.