Salman Khan: పోరాటంతో ప్రారంభం

సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కభీ ఈద్‌ కభీ దివాళి’. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ముంబయిలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ప్రస్తుతం విలే పార్లేలో వేసిన మెట్రో రైల్‌ సెట్‌లో సల్మాన్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

Updated : 14 May 2022 12:33 IST

ల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కభీ ఈద్‌ కభీ దివాళి’. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ముంబయిలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ప్రస్తుతం విలే పార్లేలో వేసిన మెట్రో రైల్‌ సెట్‌లో సల్మాన్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరో పదిరోజుల పాటు ఇక్కడే యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తారని, ఇది పూర్తయిన వెంటనే సల్మాన్‌ ‘ఇఫీ’ అవార్డుల కోసం దుబాయ్‌కు వెళ్లనున్నారని తెలిసింది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆయుష్‌ శర్మ, షెహనాజ్‌ గిల్‌, రాఘవ్‌, జహీర్‌ ఇక్బాల్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.

జూన్‌ నుంచి వెంకీ?: సల్మాన్‌ నటిస్తున్న ‘కభీ ఈద్‌ కభీ దివాళి’లో హీరో వెంకటేష్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆయన ఈ పాత్ర కోసం జూన్‌లో సెట్‌లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. కథలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని, చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంటుందని ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు