Samantha: రాష్ట్రపతిని కలిసిన సమంత.. ఫొటోలు షేర్‌ చేసిన సిటడెల్‌ టీమ్‌

సిటడెల్‌ (Citadel) యూనిట్‌ సభ్యులు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

Published : 09 Jun 2023 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలతోనే కాదు.. వరుస వెబ్‌ సిరీస్‌లతోనూ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది హీరోయిన్‌ సమంత (Samantha). ప్రస్తుతం రాజ్‌, డీకే దర్శకత్వంలో సిటడెల్‌ (Citadel)లో నటిస్తోంది. ఇందులో వరుణ్‌ధావన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటోంది. తాజాగా సిటడెల్‌ టీమ్‌ సభ్యులు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును (Droupadi Murmu) కలిశారు. ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రపతి సెర్బియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇక సిటడెల్‌ షూటింగ్‌ కూడా అక్కడే జరుగుతోంది. దీంతో సిటడెల్‌ టీమ్‌ వాళ్లు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ ఫొటోలను షేర్‌ చేసిన వరుణ్‌ ధావన్‌.. రాష్ట్రపతిని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇది టీమ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దర్శకులు రాజ్‌, డీకే దీనిపై ట్వీట్‌ చేశారు. ‘‘గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆమెకు కామెడీ సినిమాలంటే ఇష్టమని తెలిపారు. సిటడెల్‌ యాక్షన్‌ సిరీస్‌. అయినా, ఈ వెబ్‌ సిరీస్‌ను చూసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

ఇక సిటడెల్‌ విషయానికొస్తే ఇది ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్‌ మ్యాడెన్‌ (Richard Madden) తదితరులు ప్రధాన పాత్రల్లో హాలీవుడ్‌ దర్శకులు జోష్‌ అపెల్బమ్‌, బ్రెయాన్‌ ఓహ్‌, డేవిడ్‌ వీల్‌ రూపొందించిన వెబ్‌సిరీస్‌. ఇదే సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో తెరకెక్కుతోంది. రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ్‌ధావన్‌, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని