Samantha: ఆ రెండిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత

విజయ్‌ సేతుపతి హీరోగా నయనతార, సమంతా కథానాయికలుగా నటించిన కోలీవుడ్‌ చిత్రం ‘కాతు వక్కుల రెందు కాదల్‌’. ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. నిన్న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.

Published : 30 Apr 2022 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘కాతువాక్కుల రెండు కాదల్‌’. ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. ‘ఖతీజా’ పాత్రలో సమంత నవ్వులు పూయిస్తోంది. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా సమంత అభిమానులతో ముచ్చటించింది. సినిమా గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పింది. ప్రేమ, ద్వేషాలకు దూరంగా ఉంటానంటూ అభిమానులు తనపై చూపించే ప్రేమకు మాత్రం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానన్నారు. ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఈ సినిమాలోని ‘ఖతీజా’ పాత్రలో నటించానని తెలిపింది. ఆ పాత్ర పై విశ్లేషణ చేయకుండా అందరూ వారి రోజువారి జీవితంలో కొంత సమయం విరామం తీసుకొని హాయిగా నవ్వుకోవాలని కోరింది. ఈ సినిమాలో ‘డిప్పం డిప్పం’ పాట తనకెంతో ఇష్టమని.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పింది. ఇక నయనతార గురించి చెబుతూ.. ‘నయనతార అంటే నయనతారనే.. ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు. నేను ఇప్పటి వరకు కలిసిన కష్టపడే వ్యక్తుల్లో నయనతార ఒకరు’. అంటూ చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని