Samantha: వైరల్‌ అవుతున్న సమంత లేటెస్ట్‌ ఫొటో..!

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటో చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

Published : 03 May 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటో చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇటీవల 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సామ్‌ ‘పెద్దదాన్ని, తెలివైనదాన్ని’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్‌ చేసింది. తెల్లటి పువ్వులను పట్టుకొని సమంత ఎంతో అందంగా ఉన్న ఈ ఫొటోకు గంటల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి. ఇక విజయ్‌సేతుపతి సరసన నయనతార, సమంత నటించిన  ‘కాతువాక్కుల రెండు కాదల్‌’ సినిమా తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ప్రస్తుతం సమంత ఈ విజయోత్సాహంలో ఉంది. తన పుట్టినరోజు నాడు ఈ సినిమా గురించి అభిమానులతో సామ్‌ కాసేపు ముచ్చటించింది.

కాగా, గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటిస్తోన్న ‘శాకుంతలం’ చిత్రం ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాభారత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత ‘శాకుంతల’ పాత్రలో అలరించనుంది. ఇక విజయ్‌ దేవరకొండతో కలిసి సమంత నటిస్తోన్న చిత్రం ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యేర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని