samantha: నాగచైతన్య రిలేషన్‌షిప్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సమంత

Samantha: నాగచైతన్య రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. ట్విటర్‌ వేదికగా ఓ న్యూస్‌ లింక్‌ను కోట్‌ చేస్తూ తాను ఎప్పుడూ అలా అనలేదని అన్నారు.

Published : 04 Apr 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సమంత (Samantha) తో విడిపోయిన తర్వాత నాగచైతన్య(naga chaitanya) మరో కథానాయిక శోభిత ధూళిపాళ (sobhita dhulipala)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడంటూ గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చైతూతో దిగిన ఓ ఫొటోలో శోభిత కనిపించడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో వీరి రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సామ్‌ ఖండించారు. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ లింక్‌ను కోట్‌ చేస్తూ సమాధానం ఇచ్చారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. సమంత కథానాయికగా నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రిలేషన్‌షిప్‌ వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారనే దాని గురించి నేను బాధపడటం లేదు. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం  ఉన్నా కూడా కన్నీళ్లు మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. అతని ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’ అని సమంత అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. నాగచైతన్య-శోభిత రిలేషన్‌షిప్‌పైనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ  వార్తలు ప్రచురించారు. దీనిపై స్పందించిన సామ్‌ తాను ఎప్పుడూ అలా అనలేదని సమాధానం ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే సమంత నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్‌ దీనికి దర్శకుడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’లోనూ సామ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఇటీవల మళ్లీ మొదలైంది. దీంతో పాటు, ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లోనూ ఆమె నటిస్తున్నారు. మయోసైటిస్‌ నుంచి తాను వేగంగా కోలుకుంటున్నట్లు సమంత తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు