Samantha: చైతూతో విడిపోయాక చనిపోతా అనుకున్నా!

అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన రెండు నెలల తరువాత తొలిసారి విడాకులపై స్పందించారు నటి సమంత. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ బాధపడిన ఆ రోజులు  గుర్తున్నాయి.

Updated : 07 Dec 2021 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన రెండు నెలల తరువాత తొలిసారి విడాకులపై స్పందించారు నటి సమంత. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ బాధపడిన ఆ రోజులు  గుర్తున్నాయి. చైతూతో విడిపోతున్నప్పుడు కుంగిపోయి చనిపోతాననుకున్నాను. కానీ, నేను అనుకున్న దానికంటే శక్తిమంతం అయ్యాను. మన జీవితంలో కొన్నిరోజులు చెడుగా ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాటిని అంగీకరించి ముందుకు వెళ్తామో సగం పని అయినట్లే. ఎప్పుడైతే మనం అంగీకరించమో! అంతం లేని యుద్ధం చేస్తున్నట్లే! నిజానికి నేను చాలా బలహీనమైన వ్యక్తిని అని అనుకుంటా. కానీ నా వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూసి నాకే ఆశ్చర్యమేస్తోంది. ఇంత దృఢంగా ఉంటానని అనుకోలేదు’’ అన్నారు. 

ప్రస్తుతం కెరీర్‌ మీద దృష్టి పెట్టిన సమంత.. కొత్త ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు.‘యశోద’ అనే పాన్‌ ఇండియా చిత్రంతో పాటు ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలో ఆమె నటించనున్నారు. దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘శాకుంతలం’ త్వరలోనే విడుదలకానుంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని