Samantha: రణబీర్‌తో నటించాలి

బాలీవుడ్‌లో ఇప్పుడు దక్షిణాది కథానాయికల హవా కనిపిస్తోంది. ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రష్మిక, పూజా హెగ్డే.. లాంటి భామలంతా హిందీలో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తున్నారు. ‘ది ఫ్యామిలీమెన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో సమంత కూడా ఓటీటీ వేదికగా ఉత్తరాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Updated : 24 May 2021 08:13 IST

బాలీవుడ్‌లో ఇప్పుడు దక్షిణాది కథానాయికల హవా కనిపిస్తోంది. ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రష్మిక, పూజా హెగ్డే.. లాంటి భామలంతా హిందీలో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తున్నారు. ‘ది ఫ్యామిలీమెన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో సమంత కూడా ఓటీటీ వేదికగా ఉత్తరాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. రాజీ అనే ప్రతినాయిక ఛాయలున్న పాత్రను సామ్‌ పోషించింది. ఇది జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీమెన్‌ బృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది సమంత. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సామ్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘బాలీవుడ్‌లో ఏ హీరోతో తెర పంచుకోవాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించగా.. ‘రణబీర్‌ కపూర్‌తో కలిసి నటించాలనుంద’ని బదులిచ్చింది. ‘ఫ్యామిలీమెన్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ పోషించిన శ్రీకాంత్‌ తివారీ పాత్రను దక్షిణాదిలో ఎవరు చేస్తే బాగుంటుంద’ని అడగ్గా.. ‘మా మామ నాగార్జున’ అని సమాధానమిచ్చింది. బాలీవుడ్‌లో ప్రతిభ అద్భుతంగా ఉందని కొనియాడింది. సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ చిత్రంతో పాటు తమిళంలో ‘కాతు వాకులా రెండు కాదల్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని