Sammathame: అందరికీ సమ్మతమయ్యేలా....

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. ప్రవీణ కంకణాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 24 Jun 2022 09:02 IST

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా గోపీనాథ్‌ రెడ్డి (Gopinath Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’ (Sammathame). చాందిని చౌదరి (Chandini Chowdary) కథానాయిక. ప్రవీణ కంకణాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సంద్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, గాదరి కిషోర్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రాన్ని విడుదల చేస్తున్న అల్లు అరవింద్‌, బన్నీ వాసుతోపాటు దర్శకుడు సందీప్‌రాజ్‌ వేడుకకి హాజరయ్యారు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘ఇందులో ఒక్క ఇబ్బందికరమైన సన్నివేశం కూడా ఉండదు. కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ ‘‘అందరూ చూసేలా మంచి పేరు పెట్టారు. యువతరం కలిసి ఈ సినిమా చేసింది. వారికి గీతా ఆర్ట్స్‌ తోడైంది. తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. తెలుగు సినిమా కీర్తి విశ్వవ్యాప్తమైంది. కేసీఆర్‌ పరిశ్రమకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నార’’న్నారు. అందరికీ సమ్మతమయ్యే చిత్రం అవుతుందన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని