Sammathame: విడుదలకి ‘సమ్మతమే

’కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా యు.జి.ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు. కంకణాల ప్రవీణ నిర్మాత. జూన్‌ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు

Updated : 29 Apr 2022 13:55 IST

’కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా యు.జి.ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు. కంకణాల ప్రవీణ నిర్మాత. జూన్‌ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి జోడీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మంచి అనుభూతిని పంచే చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: శేఖర్‌ చంద్ర, ఛాయాగ్రహణం: సతీష్‌రెడ్డి మాసం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు