Sammathame: ఇది మా కథే అంటున్నారు
మా జీవితంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకుంటూ.. ప్రేక్షకులు సినిమాని తమకి తాము అంకితం చేసుకుంటున్నారని చెప్పారు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రానికి
మా జీవితంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకుంటూ.. ప్రేక్షకులు సినిమాని తమకి తాము అంకితం చేసుకుంటున్నారని చెప్పారు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఆయన కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘సమ్మతమే’(Sammathame). గోపీనాథ్రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రానికి లభిస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్రబృందం ఆదివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘మా కథే అంటున్నారు సినిమాని చూసిన ప్రేక్షకులు. దర్శకుడు గోపీనాథ్రెడ్డి(Gopinath Reddy) కథని ఎంత బలంగా నమ్మారో అంతే బలంగా తీశారు. ఓ మాస్ సినిమా తరహాలో సినిమాని ఆస్వాదిస్తున్నార’’ని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కథ విషయంలో నేను నమ్మిందే నిజమైంది. చూసిన ప్రేక్షకులంతా బాగుందని చెప్పడంతోనే విజయవంతంగా సినిమా ప్రదర్శితమవుతోంద’’ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రవీణ రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్